సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు ఉన్న గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ గడువు మార్చి 31 వరకు మాత్రమే ఉంది. దాన్ని మరో మూడు నెలలు పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
దీంతో లబ్ధిదారులు సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు జూన్ 30 వరకు సమయం ఇస్తున్నట్లు బుధవారం అధికారులు ప్రకటించారు.
బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లకు ఆధార్తో అనుసంధానం చేసే గడువును ఇటీవల సుప్రీంకోర్టు నిరవధికంగా పొడిగించింది.
ఈ విషయంపై కోర్టు తుది తీర్పు చెప్పే వరకు ఆధార్తో అనుసంధానికి ఇబ్బందులు లేవని వెల్లడించింది. ఇప్పటికే ఆదాయపన్ను రిటర్న్ల దాఖలు నిమిత్తం పాన్కార్డు-ఆధార్ల అనుసంధానం గడువు తేదీని జూన్ 30 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications