ఐఎస్లో చేరిన అబ్దుల్ మనఫ్ సిరియాలో మృతి
కన్నూర్: ఉగ్ర భావజాలానికి ఆకర్షితుడై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో చేరిపోయిన కేరళకు చెందిన యువకుడు సిరియాలో ప్రాణాలు కోల్పోయాడు. ఐఎస్ ఉగ్రవాదులకు మద్దతుగా పోరాటం చేస్తూ గత నవంబర్ నెలలోనే అతను చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
కన్నూర్ జిల్లాలోని వలపట్టినమ్కు చెందిన అబ్దుల్ మనఫ్(30) గత నవంబర్లో సిరియాలో చనిపోయాడని డీఎస్పీ సదానంద వెల్లడించారు. అయితే, అబ్దుల్ మృతి వార్త జనవరి 17నే అతడి కుటుంబసభ్యులకు తెలిసిందని చెప్పారు.

సిరియాలో ఉండే అబ్దుల్ స్నేహితుడు కయ్యూమ్ టెలిగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిపారు. కాగా, ఖయ్యుమ్ కూడా ఐఎస్ ఉగ్రవాదులకు మద్దతుగా పోరాడుతున్నాడని ఆ అధికారి తెలిపారు.
అబ్దుల్ కేరళకు చెందిన పాపులర్ ఫ్రంట్ ఇండియా(పీఎఫ్ఐ) నాయకుడు కావడం గమనార్హం. ఉగ్రవాదుల్లో చేరే ముందు ఇతడు ఢిల్లీలో తమ సంస్థకు ఆఫీస్ సెక్రటరీగా పనిచేశారని చెప్పారు. ఇప్పటికే కేరళ రాష్ట్రం నుంచి ఐఎస్ ఉగ్రవాదులతో కలిసి పోరాటం చేస్తున్న 15మందిలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. మరో ఐదుగురిని ఎన్ఐఏ విచారిస్తోంది. కాగా, మరో నలుగురు సిరియాలోనే ఉన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications