మాఫియా డాన్ అబూసలేంకు జీవిత ఖైదు విధించిన టాడా కోర్టు
ముంబై: మాఫీయా డాన్ అబూసలేంకు జీవిత కారాగార శిక్ష పడింది. 1995లో స్థిరాస్థి వ్యాపారి ప్రదీప్ జైన్ హత్య కేసుకు సంబంధించి బుధవారం టాడా కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. ప్రదీప్ అతడి సోదరుడు సునీల్ తోపాటు పలువురు బిల్డర్లను సలేం బెదిరించి భయకంపనలు సృష్టించాడని కోర్టు నిర్ధారించింది.
ఆస్తులపై హక్కులివ్వకపోతే కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరించి ఒప్పందం చేసుకున్నారన్నారు. ప్రదీప్ తొలుత పది లక్షలు ఇచ్చారని, మిగిలిన మొత్తం ఇవ్వకపోవడంతో 1995, మార్చి 7న జుహూ బంగళా బయట జైన్ను తుపాకీతో కాల్చి చంపారని కోర్టు పేర్కొంది. ఈ కేసులో మరో ఇద్దరు కూడా దోషులున్నారు.
ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
శ్రీనగర్: భారత సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను షోపియాన్ జిల్లాలో బుధవారం ఉదయం భారత జవాన్లు కాల్చి చంపారు. మొదట ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు.