2014: మోడీ ముందు మోకరిల్లారు! రజనీకాంత్పై ఆశ వదిలేశారు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ముందు ప్రపంచంలోని అగ్రరాజ్యాలు మోకరిల్లాయి! గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వీసా ఇవ్వడానికి నిరాకరించిన దేశాలు.. సార్వత్రిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి, ప్రధాని అయ్యాక రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. లోకసభ ఎన్నికల్లో మోడీ మేజిక్ పని చేసింది. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తారని అందరు భావించారు. కానీ, మోడీ ప్రభావంతో బీజేపీయే మేజిక్ ఫిగర్ దాటింది.
మోడీ ధాటికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంది. తమిళనాడులో జయలలిత, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్ మాత్రం మోడీ వేవ్ను తట్టుకొని నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనంత దిగజారిపోయింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వ్యూహంతో యూపీలో కమలం 73 స్థానాల్లో జెండా ఎగురవేసింది.
బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో గెలిచాక మోడీ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. బీజేపీ అగ్రనేత అద్వానీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లోను మోడీ హవా కనిపించింది. దీంతో అమిత్ షా 2014 సంవత్సరాన్ని బీజేపీ విజయనామ సంవత్సరంగా అభివర్ణించారు.
అంతర్జాతీయంగా చూస్తే స్కాట్లాండ్, క్రిమియాలలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. రెండుచోట్ల కూడా కలిసి ఉందామనే అభిప్రాయం వ్యక్తమయింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. థాయ్లాండులో ఫిబ్రవరిలో హింసాకాండ చెలరేగింది. దీంతో ఆపద్ధర్మ ప్రధాని షినవత్రా రాజధాని వదిలి పెట్టారు. కోర్టులో ఆమెకు చుక్కెదురయింది.
ఉక్రెయిన్లో భాగంగా ఉన్న క్రిమియా మార్చిలో స్వతంత్ర దేశంగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇసిస్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పలువురిని మట్టుబెట్టారు. పాకిస్తాన్లో తాలిబన్లు రెచ్చిపోయారు. పెషావర్ పాఠశాలలో 149 మంది పిల్లలు, టీచర్లను బలిగొన్నారు. పాక్కు చెందిన మలాలా, భారత్కు చెందిన సత్యార్థి నోబెల్ అందుకున్నారు.

నరేంద్ర మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ముందు ప్రపంచంలోని అగ్రరాజ్యాలు మోకరిల్లాయి! గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వీసా ఇవ్వడానికి నిరాకరించిన దేశాలు.. సార్వత్రిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి, ప్రధాని అయ్యాక రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి.

మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019 వరకు జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న క్లీన్ ఇండియా సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నారు.

పెషావర్
పాకిస్తాన్లో తాలిబన్లు రెచ్చిపోయారు. పెషావర్ పాఠశాలలో 149 మంది పిల్లలు, టీచర్లను బలిగొన్నారు.

రాంపాల్
హర్యానాకు చెందిన సంత్ రామ్ పాల్ జైలు పాలయ్యారు. ఆయన ఆశ్రమంలో జరిగిన కాల్పులలో పలువురు మృతి చెందారు.

నవాజ్ షరీఫ్
ప్రధాని నరేంద్ర మోడీ తాను బాధ్యతలు స్వీకరించే సమయంలో పాకిస్తాన్కు చెందిన నవాజ్ షరీఫ్ను కూడా ఆహ్వానించారు.

మోడీ
మోడీ ధాటికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంది. తమిళనాడులో జయలలిత, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్ మాత్రం మోడీ వేవ్ను తట్టుకొని నిలబడ్డారు.

రజనీకాంత్
సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ.. సూపర్ స్టార్ రజనీకాంత్ను కలవడం చర్చనీయాంశమైంది. ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు రజనీ కాంత్ పైన బీజేపీ ఆశలు వదిలేసుకుంది.

మోడీ
ఎన్నికల్లో గెలిచాక మోడీ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. బీజేపీ అగ్రనేత అద్వానీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు.

మోడీ
ఎన్నికల్లో గెలిచాక మోడీ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. బీజేపీ అగ్రనేత అద్వానీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications