పీవోకేపై సంచలన ప్రకటన చేసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (సోమవారం) రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారతదేశం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో ప్రతీకార దాడిని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత,భూమి, గాలి సముద్రం మీదుగా అన్ని సైనిక దాడులను నిలిపివేయడానికి రెండు దేశాలు పరస్పర ఒప్పందానికి వచ్చిన రెండ్రోజులకే ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

మే 7వ తేదీ తెల్లవారుజామున భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి పాక్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న 9 కేంద్రాలపై దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా దాడులు నిర్వహించింది.ఈ ఆపరేషన్లో 100కు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భారత సైన్యం ప్రకటించింది.ఇక ప్రధాని ప్రసంగానికి ముందు రక్షణమంత్రి రక్షణశాఖ మంత్రి, విదేశాంగ మంత్రి జైశంకర్తో పాటు త్రివిధ దళాల అధినేతలతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో భేటీ అయ్యారు.ఇక ప్రధాని ప్రసంగంకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం.












Click it and Unblock the Notifications