ఎమ్మెల్యేలు జంప్: మైసూరు రిసార్ట్ కు రెబల్ ఎమ్మెల్యేలు, సీఎం పళని, పన్నీర్ దెబ్బతో !
తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి మీద తిరుగుబాటు చేసిన అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలను పుదుచ్చేరి నుంచి కర్ణాటకలోని మైసూరుకు తరలించాలని టీటీవీ దినకరన్ నిర్ణయించారు.
చెన్నై/బెంగళూరు: తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి మీద తిరుగుబాటు చేసిన అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలను పుదుచ్చేరి నుంచి కర్ణాటకలోని మైసూరుకు తరలించాలని టీటీవీ దినకరన్ నిర్ణయించారు. ఎమ్మెల్యేలు గోడదూకడంతో మన్నార్ గుడి మాఫియా హడలిపోయింది.
గురువారం దినకరన్ క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యే ఎస్ టీకే. జక్కయ్యన్ పుదుచ్చేరి రిసార్ట్ నుంచి గోడదూకి నేరుగా చెన్నై చేరుకున్నారు. తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ను కలిసి మద్దతు ప్రకటించారు.

అనంతరం నేరుగా తమిళనాడు స్పీకర్ ధనపాల్ ను కలిసి ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా మద్దతు ఉపంసహరించుకున్నట్లు గత నెలలో ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకున్నారు. తన మద్దతు ఎడప్పాడి పళనిసామికే ఉంటుందని స్పీకర్ ధనపాల్ కు లేఖ ఇచ్చారు.
ఎమ్మెల్యే జక్కయ్యన్ జంప్ కావడంతో మిగిలిన ఎమ్మెల్యేలు గోడదూకకుండా చూసుకోవాలని టీటీవీ దినకరన్ తన మద్దతుదారుడు, రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు తంగ తమిళ సెల్వన్ కు సూచించారు. పుదుచ్చేరిలోని ఎమ్మెల్యేలను కర్ణాటక తరలించాలని నిర్ణయించారు.
తమిళనాడులోని కాంచీపురం, వేలూరు మీదుగా మైసూరుకు శుక్రవారం దినకరన్ క్యాంప్ లోని అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు బయలుదేరడానికి సిద్దం అయ్యారు. దినకరన్ క్యాంప్ లోని ఎమ్మెల్యేలకు ఎలగైనా గాలం వెయ్యాలని పళనిసామి, పన్నీర్ సెల్వం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications