పైలెట్ తో పెట్టుకోకు: పరిస్థితి వేరుగా ఉంటుంది
న్యూఢిల్లీ: పైలెట్ తో పెట్టుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుందని మరో సారి రుజువు అయ్యింది. కాక్ పీట్ లో ఎమర్జెన్సీ ఆక్సిజన్ మాస్క్ శుభ్రంగా లేదని మొండి పట్టుపట్టిన పైలెట్ మూడు గంటల పాటు విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులతో ఆడుకున్నాడు.
బుధవారం వేకువ జామున 5.35 గంటల సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులు న్యూ ఢిల్లీ నుండి కొచ్చికి వెళ్లవలసి ఉంది. అదే సమయంలో పైలెట్ (క్యాప్టెన్) నేరుగా కాక్ పీట్ లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న ఎమర్జెన్సీ ఆక్సిజన్ మాస్క్ శుభ్రంగా లేదని మండిపడ్డాడు.
వెంటనే సిబ్బంది కోలిన్ తో మాస్క్ ను శుభ్రం చేసి ఇచ్చారు. అయితే పైలెట్ మాత్రం అతని మొండితనం వీడలేదు. కొత్త మాస్క్ తీసుకు వచ్చి ఇస్తేనే తాను విమానం నడుపుతానని లేదంటే లేదని తేల్చి చెప్పాడు. అంతే ప్రయాణికులు హడలిపోయారు.

తరువాత ఆయన గారికి కొత్త మాస్క్ తీసుకు వచ్చి ఇచ్చారు. ఈ తతంగం జరగడంతో మూడు గంటల పాటు ప్రయాణికులు వేచి ఉన్నారు. ఈ దెబ్బతో ఈ ప్రభావం మిగిలిన విమానం సర్వీసుల మీద పడింది. విమానాలు ఆలస్యంగా నడిచాయి.
ఈ విషయంపై ఎయిర్ ఇండియా చైర్మన్ రోహిత్ నందన్ స్పందించారు. చిన్న చిన్న విషయాలకు పేచీలు పెట్టి విమానాలు ఆలస్యంగా నడిపితే పరిస్థితి వేరుంగా ఉంటుందని హెచ్చరించారు. బుధవారం న్యూ ఢిల్లీలో జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications