జార్ఖండ్లో బరిలో భార్య, భర్త
జార్ఖండ్ సీఎం, జేఎంఎం పార్టీ అధినేత హేమంత్ సోరెన్ మరోసారి ప్రజా తీర్పుకు రెడీ అవుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన హేమంత్ సోరెన్ ,తిరిగి మరోసారి అధికారం చేపట్టాలని ఊవిళ్లూరుతున్నారు. అయితే గతానికి భిన్నంగా ఈసారి కుటుంబ సభ్యులకు కూడా ఆయన టికెట్లు కేటాయించారు. సీఎం హేమంత్ సోరెన్ తన సొంత నియోజకవర్గమైన బర్హేట్ (ఎస్టీ) నుంచి పోటీ చేయనున్నారు. ఆయన భార్య కల్పన గాండేయ్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. హేమంత్ సోదరుడు బసంత్ ఈసారి దుమ్కా నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మహతో నాలా నుంచి, మంత్రి మిథిలేశ్ ఠాకూర్ గర్వా నుంచి పోటీచేస్తున్నారు.
మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన కేదర్ హజారా ఇటీవల హేమంత్ సోరెన్ పార్టీలో చేరారు. ఆయనకు జమూనా నియోజకవర్గం టికెట్ కేటాయించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం బాబూలాల్ మరాండీ, ప్రతిపక్ష నేత అమర్ కుమార్ బౌరీ, అసెంబ్లీ స్పీకర్ రవీంద్ర నాథ్ మహ్తో, ఏజేఎస్యూ పార్టీ చీఫ్ సుదేశ్ మహ్తోలు ఉన్నారు. ఇక ఇటీవలే జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నుంచి బీజేపీలో చేరిన హేమంత్ వదిన సీతాసోరెన్ బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు.దీంతో ఆయా స్థానాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.హేమంత్ సోరెన్ ఇండియా కూటమితో కలిసి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

'ఇండియా' కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. జేఎంఎం 70 చోట్ల, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు 11 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఇక జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది.12 జిల్లాల్లోని 38 స్థానాలకు బుధవారం ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడతలో 528 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో 55 మంది మహిళా క్యాండిడేట్స్ ఉన్నారు. మొత్తంగా 1.23 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనుండగా అందులో 147 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో ఈసీ రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 13న 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొదటి దశ పోలింగ్ జరిగింది. రెండు దశల ఫలితాలు ఈ నెల 23నే విడుదల కానున్నాయి.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications