రెండువేలను ఆమె మోయలేకపోయింది
ఉత్తర ప్రదేశ్ :రెండువేల నగదును ఓ మహిళ మోయలేకపోయింది. మీరు చదివింది కరెక్టే. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ మహిళ బ్యాంకు అధికారులు ఇచ్చిన రెండు వేల నగదును మోయలేకపోయింది.పెద్ద నగదు నోట్ల రద్దుతో ఆమెకు కష్టాలు వచ్చాయి.
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సర్జుదేవి 60 ఏళ్ళు వయస్సు.ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కొడుకు రామ్ కుమార్ క్యాన్సర్ తో భాదపడుతున్నాడు.ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లక్ష రూపాయాలు ఇచ్చాడు. ఈ డబ్బులతో కొడుకుకు చికిత్స చేయిస్తోంది.

లక్నోకు 25 కిలోమీటర్ల దూరంలోని మోహన్ లాల్ గంజ్ లో ఆమె నివాసం ఉంటుంది. పెద్ద నగదు నోట్ల రద్దు తో ఆమె చేతిలో డబ్బుల్లేకుండా పోయాయి. తన వద్ద ఉన్న నగదును మార్పిడి చేసుకొనేందుకు ఆమె మంగళవారం నాడు బ్యాంకుకు వెళ్ళింది.
తన వద్ద ఉన్న పెద్ద నగదును ఆమె బ్యాంకులో జమచేసింది. వాటికి సమానమైన నగదు కోసం ఎదురు చూస్తోంది.బ్యాంకు అధికారులు ఆమెకు షాక్ ఇచ్చారు. రెండువేల రూపాయాల చిల్లరను ఆమెకు ఇచ్చారు.రెండువేల రూపాయాల విలువైన చిల్లర నాణెలను ఓ బ్యాగులో పోసి ఇచ్చారు బ్యాంకు అధికారులు.ఈ బ్యాగు సుమారు 18 కిలోలుంది. ఈ వయస్సులో ఆ బ్యాగును మోయడం ఆమెకు ఇబ్బందిగా మారింది. ఇంటివద్ద ఉన్న తన కొడుకు పిలిపించి బ్యాగ్ ను ఆమె తీసుకెళ్ళింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications