అమ్మ కోసం 24 గంటలు ముళ్ల పాన్పు మీద ప్రార్థన
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా ఆరోగ్యంగా తిరిగిరావాలని ఆమె అభిమానులు పలు విధాలుగా దేవుడికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. కొందరు సాహసం చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు.
జయలలిత ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు, అన్నాడీఎంకే నాయకులు సరైన వివరాలు వెల్లడించడం లేదని కార్యకర్తలు, అమ్మ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే లండన్, సింగపూర్ నుంచి ప్రత్యేక వైద్యులు చెన్నై వచ్చారని తెలుసుకున్న అభిమానులు ఇంకా ఎక్కువ ఆందోళన చెందుతున్నారు.
అమ్మ ఆరోగ్యం కుదటపడాలని ప్రత్యేక హోమాలు, పూజలు చేస్తున్నారు. తమిళనాడులోని మదురైకి చెందిన ఇరులంది (68) అనే ఆయన అమ్మ మీద తన అభిమానాన్ని చాటుకున్నారు.

ప్రత్యేకంగా ఆయనే ఓముళ్ల పాన్పును తయారు చేసుకున్నారు. ఐదు రకాల ముళ్లతో ఆ పడక తయారు చేసుకున్నారు. అందులో విషపూరిత ముళ్లు ఉన్నాయి. ఆ ముళ్ల పాన్పు మీద 24 గంటల పాటు పడుకుని అమ్మ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించారు.
తాను నిత్యం ఆరాధించే పెచ్చియమ్మన్ దేవతకు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసి అమ్మ త్వరగా కోలుకోవాలని వేడుకున్నారు. విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు ఇరులందికి ఉన్న అమ్మ భక్తిని గుర్తించి ప్రశంసించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications