వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20 రోజుల్లో మూడోది: చెట్టుకు వేలాడుతూ 19 ఏళ్ల గర్ల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Another girl found hanging from a tree, third such case in the UP
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణాలు కొనసాగుతున్నాయి. మొరాబాద్ జిల్లాలో గురువారం ఉదయం మరో యువతి శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. రాష్ట్రంలో గత ఇరవై రోజుల్లో ఇలాంటి సంఘటన ఇది మూడోది. గతంలో ఇద్దరు యువతులపై అత్యాచారం చేసి, హత్య చేసి చెట్టుకు వేలాడదీశారు. బుధవారం ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిపి చెట్టుకు ఉరివేశారు.

తాజాగా మొరాబాద్ జిల్లాలో 19 ఏళ్ల యువతి శవం చెట్టుకు వేలాడుతూ కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. యువతి మృతదేహాన్ని వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. అత్యాచారమా, హత్యా అన్నది పరీక్షల అనంతరం తెలుస్తుందని పోలీసులు అధికారులు తెలిపారు.

కాగా, ఉత్తర ప్రదేశ్‌లో వరుస అత్యాచారాల నేపథ్యంలో అఖిలేష్ ప్రభుత్వం పైన విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. బిజెపి, బిఎస్పీలు రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తున్నాయి.

సీబీఐ విచారణ

ఉత్తర ప్రదేశ్‌లోని బడాయా జిల్లాల్లో మహిళపై అత్యాచారం, హత్య కేసు పైన సీబీఐ విచారణ చేపట్టింది. ఇరవై మంది సభ్యుల బృందం శుక్రవారం ఘటన స్థలికి చేరుకొని దర్యాఫ్తు చేపట్టనుంది.

English summary
There are reports of another horrifying case of alleged murder yet again in Uttar Padesh. In a third such incident, a 19 year old girl was reportedly found hanging from a tree in the Thakur Dwara area in Moradabad on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X