వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జవాను: ఐదుగురు సహోద్యోగులను చంపి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని గండేర్బాల్ జిల్లాలో ఓ సైనిక జవాను ఐదుగురు సహోద్యోగులను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వారిని కాల్చి చంపి తాను కాల్చుకున్నాడు.

ఆ సంఘటన మనస్బాల్‌లోని 13 రాష్ట్రీయ రైఫిల్ శిబిరంలో చోటు చేసుకుంది. బుధవారంనాడు రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనపై నిమిత్తం ఆర్మీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. తన సహోద్యోగులతో అతను వాగ్వివాదానికి దిగినట్లు చెబుతున్నారు. వివాదం ముదరడంతో అతను ఈ చర్యకు దిగినట్లు అనుమానిస్తున్నారు.

Army jawan shoots dead five colleagues, kills self

ఆర్మీ జవాను విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు అంటున్నారు. కాల్పుల అనంతరం తనను తాను కాల్చుకుని చంపుకున్నాడని చెప్పారు.

గత 24 ఏళ్ల నుంచి ఇటువంటి సంఘటనలు జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతూనే ఉన్నాయని అంటున్నారు. తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తుండడం వల్లనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు.

English summary
In Ganderbal district of Jammu & Kashmir, an Armyman killed five of his colleagues and then went on to shoot himself. The incident took place at the 13 Rashtriya Rifles camp in Manasbal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X