బాలిలోనే చోటా రాజన్ను లేపేయాలనుకున్న దావూద్
ఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. చోటా రాజన్ను చంపేందుకు పక్కా ప్లాన్ వేశాడా? అంటే అవుననే అంటున్నారు. దావూద్ వేసిన ప్లాన్ కొద్దిలో తప్పిపోవడంతో చోటా రాజన్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్ వెలుగు చూసింది.
చోటా రాజన్ను దావూద్ ఇబ్రహీం ఎలా చంపాలనకున్నది... దావూద్ అనుచరుడు చోటా షకీల్ ఆడియో సందేశంలో కనిపించింది. ఇండోనేషియాలోనే చోటా రాజన్ను దావూద్ చంపేయాలనుకున్నాడు. చోటా షకీల్ ఆ ప్లాన్ను వివరించాడు.
ఓ మీడియా సంస్థ ప్రతినిధికి ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చాడు. చోటా రాజన్ను లాకప్లోనే చంపేస్తారా? అన్న ఓ ప్రశ్నకు ఫోన్లో వేగంగా స్పందించిన షకీల్... రాజన్ చంపేసేందుకు ఇండోనేసియా నగరం బాలిలోనే ప్లాన్ వేశామని చెప్పాడు.

కొంతమేర సమాచారం రాని నేపథ్యంలోనే తమ ప్లాన్ విఫలమైందన్నాడు. అతనిని భారత్లో అంతే చేస్తామన్నాడు. బాలిలో అరెస్ట్ తర్వాత చోటా రాజన్ పలుమార్లు మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో ఓ పురుషుడితో పాటు మహిళను జర్నలిస్ట్గా రంగంలోకి దించామని చోటా షకీల్ చెప్పాడు.
సదరు నకిలీ విలేకర్లకు ఐడీ కార్డులతో పాటు కెమెరాలు కూడా అందించామన్నాడు. జర్నలిస్టుల రూపంలో రాజన్ వద్దకు వెళ్లిన తర్వాత ఆ మహిళ రాజన్ పైన కాల్పులు జరపాలని తాము ప్లాన్ వేశామన్నాడు. అయితే అంతమంది దగ్గరగా ఉన్న సమయంలో ఆయుధం తీసి అతన్ని కాల్చేందుకు వీలుకాలేదన్నాడు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications