romance: నాటీ అల్లుడు, రొమాంటిక్ అత్త, అర్దరాత్రి అత్తను లేపుకుపోయిన కొత్త అల్లుడు, హయ్యారే హయ్యా !
జైపూర్/రాజస్థాన్: అత్తా, అల్లుడు సంబంధానికి సంబంధించిన కొన్ని విచిత్రమైన సంఘటనలు మనదేశంతో పాటు విదేశాల్లో జరుగుతున్నాయి. దంపతులు వారి కుమార్తెను ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. యువతిని పెళ్లి చేసుకున్న యువకుడు అతని అత్తారింటికి భార్యతో కలిసి వెళ్లి వస్తున్నాడు. భార్యతో అప్పుడప్పుడు అత్తారింటికి వెళ్లి వస్తున్న యువకుడు ఎప్పటిలాగే కొత్త సంవత్సరం ముందు రోజు వారి ఇంటికి వెళ్లాడు. భార్యతో కలిసి భర్త ఓ రూమ్ లో, అల్లుడూ, కూతురు మరో రూమ్ లో నిద్రపోయారు. ఉదయం నిద్రలేచి చూస్తే మామ పక్కన అత్త, కూతురి పక్కన భర్త మాయం అయ్యారు. అత్తా అల్లుడు మాయం కావడం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ అయ్యింది.
గత ఏడాది పెళ్లి చేశారు
రాజస్తాన్ లోని సిరోగి జిల్లాలోని సయాగర అనే గ్రామంలో రమేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రమేష్ కు స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే భార్య ఉంది. రమేష్, స్వప్నా దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రమేష్ తన పెద్ద కూతురు కిష్ణ నారాయణ్ జోగి అే యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు, క్రిష్ణ నారయణ్ జోగి అతని భార్యతో కలిసి సంతోషంగా జీవించడం మొదలుపెట్టాడు.
అత్తారింటికి దారేది ?
నారాయణ్ జోగి అతని భార్యతో పాటు అత్తగారి ఇంటికి తరచూ వెళ్లేవాడు. అత్తారింటికి వెలుతున్న నారాయణ్ జోగి అతని అత్తమామలు రమేష్, స్వప్నాతో పాటు అతని మరదల్లతో చలా సరదాగా ఉండేవాడు. ఇదే సందర్బంలో అత్త స్వప్నాతో నారాయణ్ జోగికి చనువు పెంచుకున్నాడు. రానురాను అత్త స్వప్నా, ఆమె అల్లుడు నారాయణ్ జోగి ఫోన్లలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
అల్లుడికి ట్రైనింగ్ ఇచ్చిన అత్త
రానురాను ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అత్త స్వప్నా, అల్లుడు నారాయణ్ జోగి రాసుకుని పూసుకుని తిరగడం మొదలుపెట్టారు. రానురాను అత్తా అల్లుడు స్వప్నా, నారాయణ్ జోగిల మద్య ప్రేమ చిగురించింది, ఇది స్వప్నా, ఆమె అల్లుడు నారాయణ్ జోగిల మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది. ఒకానొక సమయంలో ఇద్దరూ ఒకరిని వదలి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చేశారు.
కూతురు బతుకు దేవుడే చూసుకుంటాడు
కన్న కూతురిని పెళ్లి చేసుకున్న అల్లుడు నారాయణ్ జోగి మోజులో పడిపోయిన అత్త స్వప్నా తన కూతురికి, భర్త రమేష్ కు మా అక్రమ సంబందం మ్యాటర్ తెలిస్తే ఏం జరుగుతుంది అని ఏమాత్రం ఆలోచించలేదు. తనకూతురు యవ్వనంలో ఉంది, ఎవడో ఒకడు రెండో పెళ్లి చేసుకుంటాడు, ముందు నేను అల్లుడు నారాయణ్ జోగితో సెటిల్ అయిపోతే ఒకపనైపోతుందని స్వప్నా అనుకుంది.
అత్తారింటిలో న్యూఇయర్ పార్టీ
అల్లుడు నారాయణ్ జోగితో కలిసి లేచిపోవాలని అత్త స్వప్నా డిసైడ్ అయ్యింది. అత్తతో లేచిపోవడానికి అల్లుడు నారాయణ్ జోగి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, న్యూఇయర్ సంబరాలు మీ ఇంట్లో జరుపుకుందామని నారాయణ్ జోగి అతని భార్యకు చెప్పాడు. పుట్టింటికి పిలుచుకుని వెలుతానంటే నేను వద్దంటానా అంటూ నారాయణ్ జోగి భార్య కూడా మా అమ్మ ఇంటికి వెలుదామని చెప్పింది. డిసెంబర్ 30వ తేదీన నారాయణ్ అతని భార్యతో కలిసి అత్తారింటికి వెళ్లాడు.
అత్తతో జంప్ జిలాని
కూతురు ఇంట్లో లేని సమయంలో స్వప్నా ఆమె అల్లుడు నారాయణ్ కు స్కెచ్ గురించి చెప్పింది. రాత్రి నారాయణ్ అతని భార్యతో కలిసి భర్త ఓ రూమ్ లోకి వెళ్లాడు. తరువాత స్వప్నా ఆమె భర్త రమేష్ తో కలిసి మరోరూమ్ లోకి వెళ్లి నిద్రపోయింది. ఉదయం నిద్రలేచి చూస్తే మామ రమేష్ పక్కన అతని భార్య స్వప్నా, కూతురి పక్కన ఆమె భర్త నారాయణ్ జోగి మాయం అయ్యారు. స్వప్నా, ఆమె అల్లుడు నారాయ్ జోగి కోసం కుటుంబ సభ్యులు ఇంతకాలం వెతికారు.
నా అల్లుడు నాకొంప ముంచేశాడు
భార్య స్వప్నా కోసం, అల్లుడు నారాయణ్ కోసం ఎక్కడెక్కడో వెతికిన మామ రమేష్ నా భార్యను వెతికిపెట్టండి అంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి నారాయణ్ జోగి, అతి అత్త స్వప్నా కోసం గాలిస్తున్నారు. కన్న కూతురి భర్తతో అక్రమ సంబందం పెట్టుకున్న అత్త అర్దరాత్రి అతనితో కలిసి లేచిపోయింది అని తెలుసుకున్న స్థానికులు హడలిపోయారు.