అజాద్ ఎన్కౌంటర్పై పిటిషన్ కొట్టివేత: హైకోర్టులో సవాల్ చేస్తామన్న పద్మ(ఫొటోలు)
ఆదిలాబాద్: మావోయిస్టు అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరకూరి రాజ్కుమార్ ఎన్కౌంటర్ ఉదంతంలో 29మంది పోలీసులపై హత్యా నేరం నమోదు కోరుతూ దాఖలైన పిటిషన్ను మంగళవారం ఆదిలాబాద్లోని జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మేరీ సారాధానమ్మ కొట్టివేశారు.

2011లో జరిగిన ఈ ఎన్కౌంటర్ బూటకమంటూ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేష్, ఎన్కౌంటర్లో మృతి చెందిన జర్నలిస్టు హేమచంద్ర పాండే సహచరి బబితా పాండే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు వేశారు. దీంతో విచారణ చేపట్టాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం సిబిఐని ఆదేశించింది.

ఆ తర్వాత ఆత్మరక్షణ కోసమే పోలీసులు, ఆజాద్, హేమచంద్ర పాండేలను ఎదురుకాల్పుల్లో కాల్చి చంపారని సిబిఐ నివేదిక అందజేసింది. దీంతో ఈ వ్యవహారాన్ని దిగువ కోర్టుల్లోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ మేరకు ఆజాద్ సహచరి పద్మ, బబితా పాండే ఆదిలాబాద్ కోర్టులో 2013లో ప్రొటెస్టు పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఏడాదిన్నరపాటు వాద ప్రతివాదనలు విన్న అనంతరం మంగళవారం తీర్పు వెలువడింది. కాగా, ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని పద్మ మీడియాకు తెలిపారు.












Click it and Unblock the Notifications