ఓటు హక్కు రద్దు..! జనాభా అదుపు కోసం బాబా రామ్ దేవ్ కొత్త సూత్రం..!
అలీఘడ్ : పెరుగుతున్న జనాభాకు అడ్డుకట్ట వేయాల్సి ఉందన్నారు యోగా గురువు బాబా రామ్ దేవ్. జనాభాను అదుపు చేయాలంటే కఠిన నిబంధనలు తప్పనిసరి చేయాలని వ్యాఖ్యానించారు. ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మంది ఉన్నవారికి ఓటు హక్కు రద్దు చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ లో పతంజలి స్టోర్స్ ప్రారంభించిన బాబా రామ్ దేవ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఇద్దరిని మించి పిల్లలు ఉన్నవారు ఎలక్షన్లలో పాల్గొనకుండా నిషేధం విధించాలన్నారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వ ప్రోత్సహకాలు అందకుండా చూడాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో అడ్మిషన్లు లేకుండా చేయడంతో పాటు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం తీసుకోకుండా చేయాలని అన్నారు.

దేశంలో జనాభా శరవేగంగా పెరుగుతోందని అభిప్రాయపడ్డ ఆయన కొన్ని నిబంధనలు తప్పనిసరి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జనాభా అదుపు చేయడానికి నియమాలు రూపొందించాల్సిన అవసరముందన్నారు. ఓటు హక్కు తొలగించడం, ప్రభుత్వ ప్రోత్సహకాలు అందించకుండా చేయడం చేస్తే జనాభా అదుపులోకి వస్తుందన్నారు. మతాలకు సంబంధం లేకుండా ఎవరైనా సరే అందరికీ వర్తించేలా నియమనిబంధనలు ఉండాలన్నారు. అలా కఠినతరం చేస్తేనే జనాభా కంట్రోల్ అవుతుందని వ్యాఖ్యానించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications