బదౌన్ రేప్: బాధితుల కుటుంబీకులకు పాలీగ్రాఫ్ టెస్ట్

కాగా, సిబిఐ వ్యవహరించిన తీరు పట్ల బాధితుల కుటుంబ సభ్యులు, నయా దార్ పార్టీ కార్యకర్తలు జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. తమ కుటుంబసభ్యులపై సిబిఐ వేధింపులు ఆపాలని బాధితురాలి సోదరుడు వీరేంద్ర డిమాండ్ చేశారు. సిబిఐ నిందితులపై దృష్టి సారించకుండా బాధితులను వేధించడమేంటని ఆయన ప్రశ్నించారు.
మూడు రోజుల పాటు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం సిబిఐ ఆ నలుగుర్ని వదిలిపెట్టనుంది. పరీక్షలు తొందరగా పూర్తయితే త్వరగా పంపించే అవకాశం ఉంది. సోమవారం నుంచి సిబిఐ వీరికి పరీక్షలు నిర్వహిస్తోంది.
కాగా, తమను పరీక్షల నిమిత్తం తీసుకెళ్లి వేధింపులకు గురి చేశారని వారు ఆరోపించారు. బాధిత యువతి సెల్ఫోన్ ఎలా పగిలిపోయిందని పదే పదే సిబిఐ ప్రశ్నిస్తోందని అన్నారు. తాము బాధితురాలి బంధువులను అనుమానించడం లేదని.. వారి నుంచి వివరాలు సేకరించేందుకే వారిని ప్రశ్నిస్తున్నామని సిబిఐ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications