పెద్ద సంఖ్యలో చొరబడిన ఉగ్రవాదులు: శ్రీనగర్, ఢిల్లీలో హైఅలర్ట్
శ్రీనగర్: మనదేశంలో పాకిస్థాన్ మరోసారి ఉగ్రఘాతుకానికి తెగబడేందుకు కుట్రలు పన్నుతోందని తెలిసింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నుంచి జమ్మూకాశ్మీర్లోకి ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో చొరబడినట్లు భద్రతా అధికారులకు సమాచారం అందింది. దీంతో జమ్మూకాశ్మీర్తో పాటు దేశ రాజధాని ఢిల్లీ నగరంలోనూ భద్రతా సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు.
పాకిస్థాన్, జమ్మూకాశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ దాటుకుని దాదాపు 20 మంది ముష్కరులు కాశ్మీర్లోకి ప్రవేశించారని అధికారులు వెల్లడించారు. భారత్లోకి ప్రవేశించిన ఈ ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది మౌలానా మసూద్ అజహర్కు చెందిన జైషే ఈ మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన వారని అధికారులు వెల్లడించారు.

ఈ క్రమంలో వీరు ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందనే ఆందోళనతో కాశ్మీర్ సహా ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రతా సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఇంటెలీజెన్స్ బ్యూరో అధికారులు హెచ్చరించారు. సున్నితమైన ప్రాంతాల్లో పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.
ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు దేశంలో చొరబడడం చాలా అరుదని అధికారులు చెబుతున్నారు. వీరు కాశ్మీర్లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, రెండు, మూడు రోజుల్లో దాడులు చేసే అవకాశం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదుల పన్నాగాలను భగ్నం చేయాలని భద్రతాదళాలకు ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications