ఢిల్లీ తరహాలో.. జూలో వ్యక్తిపై దాడి చేసి తినేసిన ఎలుగుబంటి
రాయ్పూర్: ఢిల్లీలోని జూలో ఓ యువకుడిని చిరుతపులి చంపేసిన ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. చత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జూలో సోమవారం ఓ ఎలుగుబంటి యువకుడిని చంపేసింది. జూలో ఉన్న ఎలుగుబంటి ఆ యువకుడిపై హఠాత్తుగా దాడిచేసింది. అందరూ చూస్తుండగానే సజీవంగా అతడ్ని తినేసింది.
కాగా, ఘటన అనంతరం ఆ ఎలుగుబంటిని కాల్చి చంపినట్లు తెలిపారు. ఎలుగుబంటి హఠాత్తుగా దాడి చేయడంతో ఆ వ్యక్తి సహాయం కోసం ఆర్తనాదాలు చేశాడు. దీంతో సమీపంలో ఉన్న వ్యక్తులు ఆ ఎలుగుబంటిపై రాళ్లు మొత్తడం ప్రారంభించారు. అయినా ఆ ఎలుగుబంటి అతడ్ని లాక్కుని వెళ్లి తీవ్రంగా గాయపర్చింది. అతడు ప్రాణాలతో ఉండగానే తినేసింది.

ఆ ఎలుగుబంటి గతంలో కూడా ఇద్దరు వ్యక్తులపై దాడి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఓ రైతును, మరో వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేసినట్లు చెప్పారు. వారిద్దరూ ఎలుగుబంటితో పోరాడేందుకు ప్రయత్నించినా.. ఆ ఎలుగుబంటి వారిని తీవ్రంగా గాయపర్చి చంపేసిందని తెలిపారు.
ఆ ఎలుగుబంటి వ్యక్తులను చంపేసిన తర్వాత కొన్ని భాగాలను తినేసిందని అధికారులు చెప్పారు. తాజా ఘటనతో ముగ్గురి మరణానికి కారణమైన ఆ ఎలుగుబంటిని పోలీసులు కాల్చి చంపారని అధికారులు తెలిపారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications