బెంగాల్ మంత్రిపై బాంబు దాడి, మరో ఇద్దరికీ గాయాలు.. మినిష్టర్ పరిస్థితి క్రిటికల్..
పశ్చిమబెంగాల్ మంత్రిపై బాంబు దాడి జరిగింది. ముర్షిదాబాద్ జిల్లా నిమిత్తి రైల్వేస్టేషన్ వద్ద దుండగులు నాటుబాంబుతో దాడి చేశారు. దాడిలో కార్మికశాఖ మంత్రి జాకీర్ హుస్సేన్కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే జంగీపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి క్రిటికల్గానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
బాంబు దాడిలో మంత్రితోపాటు మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. వారిలో ఒకరు ఆయన మేనల్లుడు ఉన్నారు. రైలులో కోల్ కతా వెళ్లడానికి బుధవారం రాత్రి 10 గంటలకు నిమిత్తా రైల్వేస్టేషన్ వచ్చారు. రైలు కోసం ప్లాట్ పామ్ నంబర్ 2 వద్ద వేచి చూస్తుండగా దాడి జరిగింది. ఇదీ సుతి పోలీస్ స్టేషన్ ఏరియా కిందకి వస్తోంది. దుండగులు ఒక్కసారిగా బాంబు విసిరారని స్థానికులు తెలిపారు.

బాంబు దాడి ఘటనతో పోలీసుల అక్కడికి చేరేకున్నారు. దుండగులను కనిపెట్టే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. మరికొద్దిరోజుల్లో బెంగాల్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బాంబు దాడి జరగడం కలకలం రేపుతోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications