టెకీ మృతి కేసులో సంచలనం.. నోయిడా అథారిటీ సీఈఓపై వేటు
ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో ఒక నిర్మాణ స్థలంలో ఉన్న నీటి గుంతలో ఓ యువ ఇంజినీర్ కారు అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ టెకీ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ ఘటనను యూపీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు నోయిడా అథారిటీ సీఈఓ ఎం లోకేశ్ పై వేటు వేసింది. అంతేకాక ఈ ప్రమాదంపై సిట్ విచారణకు ఆదేశించింది. ఐదు రోజుల్లో రిపోర్టు సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తర్ ప్రదేశ్ నోయిడా సెక్టార్ 150 లో కారు అదుపుతప్పి నీటితో నిండిన గుంతలో పడి 27 ఏళ్ల టెకీ మరణించిన నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు నోయిడా అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం. లోకేశ్ ను పదవి నుంచి తొలగించింది. ఈ ఘటనపై తక్షణమే సిట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, జోన్ మీరట్ నేతృత్వంలో త్రిసభ్య దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో మీరట్ డివిజనల్ కమిషనర్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ కూడా ఉన్నారు. ఈ బృందం ఐదు రోజుల్లోగా తమ నివేదికను సమర్పించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏం జరిగిందంటే..?
గురుగ్రామ్ లోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా యువరాజ్ మోహతా పని చేస్తున్నాడు. రోజూలాగే ఆఫీస్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో నోయిడాలోని సెక్టార్- 150లోని ఏటీఎస్ లే గ్రాండియోస్ కూడలి వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి ఓ గోడను ఢీకొట్టి.. ఆ తర్వాత పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 27 ఏళ్ల యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ యువరాజ్ మెహతా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమయంలో సహాయక చర్యలు కూడా సకాలంలో అందలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
అయితే అతివేగం, పొగమంచు, రోడ్డు పరిస్థితులు.. ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన మోనిందర్ మాట్లాడుతూ.. యువరాజ్ గంటా నలభై ఐదు నిమిషాల పాటు "దయచేసి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి" అని ప్రాధేయపడ్డాడని వివరించాడు. నీటి లోతు ఎక్కువగా ఉండటం, భద్రతా సిబ్బంది లేకపోవడం వల్ల సకాలంలో రక్షించ లేకపోయారని తెలిపారు.

మరోవైపు ఇదే ఘటనపై యువరాజ్ తండ్రి నోయిడా అథారిటీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సెక్టార్ 150 నివాసితులు డ్రైయిన్ కు సమీపంలో బారికేడ్లు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయమని పదేపదే విజ్ఞప్తి చేసినా, అథారిటీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications