Bihar Election 2025 Phase 1 LIVE: నువ్వా నేనా..సై..!!

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకం కానున్న తొలిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. ఈ మొదటి దశ పోలింగ్ ఫలితం తర్వాతి దశ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.మొదటి దశ ఎన్నికల కోసం ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

బీహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉండగా,పురుష ఓటర్లు 3.92 కోట్లు,మహిళా ఓటర్లు 3.5 కోట్లు,తొలిసారి ఓటు వేస్తున్నవారు 14 లక్షలు,వయోవృద్ధుల ఓటర్లు 4 లక్షలు ఉన్నారు.మొదటి దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది.మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

Bihar Election 2025 Phase 1 LIVE voting updates in telugu Tough fight between NDA and INDIA alliance

ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ (NDA) కూటమి తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. రాష్ట్రంలో నితీష్ కుమార్ 20 ఏళ్ల పాలన, కేంద్రంలో ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలన ఆధారంగా ఈ కూటమి ఓట్లు అడుగుతోంది.అయితే, ప్రతిపక్ష మహాకూటమి మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత, సరైన పాలన లేకపోవడం ,పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన హామీల ఆధారంగా ఓట్లను అభ్యర్థిస్తోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఇక బీహార్ తొలిదశ పోలింగ్‌కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Nov 06, 2025, 2:48 pm IST
బీహార్

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఉప ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి లఖీసరయ్ లో విజయ్ కుమార్ సిన్హా కారుపై దాడి జరిగింది.ఆయన కారుపై చెప్పులు విసిరారు.
Nov 06, 2025, 11:55 am IST
బీహార్

తొలి విడత ఎన్నికల్లో ఉదయం 11 గంటలకు వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
Nov 06, 2025, 11:46 am IST
బీహార్

Bihar
ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించడానికి పాట్నాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద జానపద గీతాలను ప్రదర్శిస్తోన్న కళాకారులు
Nov 06, 2025, 11:08 am IST
బీహార్

Ravi Shankar Prasad
పాట్నాలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, ఆయన భార్య మాయా శంకర్
Nov 06, 2025, 10:29 am IST

భక్తియార్ పూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్. మరో విడత అధికారంలోకి వస్తోన్నామనీ, డబుల్ ఇంజిన్ సర్కార్ కు ఓటర్లు మళ్లీ గెలిపించబోతోన్నారని వ్యాఖ్యానించారు.
Nov 06, 2025, 9:53 am IST
బీహార్

తొలి విడతలో ఉదయం 9 గంటల వరకు 13.13 పోలింగ్ శాతం నమోదైనట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. తొలి రెండు గంటల్లో తేజస్వి యాదవ్, రబ్రీ దేవి, లాలూ ప్రసాద్ యాదవ్, కేంద్రమంత్రులు చిరాగ్ పాశ్వాన్, నిత్యానంద రాయ్, ఉప ముఖ్యమంత్రులు విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి వంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Nov 06, 2025, 9:21 am IST
బీహార్

దేశ ఎన్నికల వ్యవస్థపై అధ్యయనం చేయడానికి బీహార్ కు వచ్చిన కొలంబియాకు చెందిన ప్రతినిధులు. నలందలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ను సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ గురించి వారికి జిల్లా కలెక్టర్ కుందన్ కుమార్ వివరించారు.
Nov 06, 2025, 9:04 am IST
బీహార్

తన ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. తన ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇద్దరూ గెలవబోతోన్నారని, చరిత్రను తిరగరాసేలా ప్రజల తీర్పు ఉండబోతోందని అన్నారు.
Nov 06, 2025, 8:57 am IST
బీహార్

మొదటి విడత పోలింగ్ సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. రాష్ట్రంలో ఈ సారి మార్పు తప్పదని, ప్రజా వ్యతిరేక శక్తులకు ఓటమి తప్పదని అన్నారు.
Nov 06, 2025, 8:41 am IST
బీహార్

Tejaswi Yadav
మొదటి విడత పోలింగ్ సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్. రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. బీహార్ మార్పు కోరుకుంటోందని వ్యాఖ్యానించారు.
Nov 06, 2025, 8:25 am IST
బీహార్

తన ఓటు హక్కును వినియోగించుకున్న నటుడు, గాయకుడు కేసరి లాల్ యాదవ్. ఛాప్రా నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
Nov 06, 2025, 7:44 am IST
బీహార్

వైశాలిలో తన ఓటు హక్కును వినియోగించుకున్న వయోధిక వృద్ధురాలు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు తమ భుజాల మీద తీసుకొని పోలింగ్ కేంద్రానికి వచ్చారు.
Nov 06, 2025, 7:12 am IST
బీహార్

పాట్నా, దర్భంగా, మాధేపురా, సహర్సా, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, సివాన్, సరన్, వైశాలి, సమస్తిపూర్, బెగుసరాయ్, లఖిసరాయ్, ముంగేర్, షేక్‌పురా, నలంద, బక్సర్, భోజ్‌పూర్‌ సహా 18 జిల్లాల్లో మొదటి దశలో పోలింగ్ సాగుతోంది.
Nov 06, 2025, 7:10 am IST
బీహార్

అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ లో పాల్గొనాలని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండుగగా అభివర్ణించారు.
Nov 06, 2025, 7:06 am IST
బీహార్

అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఆరంభమైంది. సామ్రాట్ చౌదరి- తారాపూర్, తేజస్వీ యాదవ్- రాఘోపూర్, తేజ్ ప్రతాప్- మహువా, మైథిలీ ఠాకూర్- అలీనగర్, అనంత్ సింగ్- మొకామా పోటీలో ఉన్నారు.
Nov 06, 2025, 6:23 am IST
బీహార్

తొలి విడత పోలింగ్ సన్నాహాలు పూర్తయ్యాయి. ఈవీఎంల పనితీరునను పరీక్షించడానికి అన్ని బూత్ లల్లో మాక్ పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Nov 05, 2025, 10:44 pm IST

మొదటి దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది.మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Nov 05, 2025, 10:44 pm IST

తొలిసారి ఓటు వేస్తున్నవారు 14 లక్షలు,వయోవృద్ధుల ఓటర్లు 4 లక్షలు ఉన్నారు.
Nov 05, 2025, 10:44 pm IST

పురుష ఓటర్లు 3.92 కోట్లు,మహిళా ఓటర్లు 3.5 కోట్లు ఉన్నారు.
Nov 05, 2025, 10:44 pm IST

బీహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+