మోడీ సునామీ : తొమ్మిది చోట్ల బీజేపీ క్లీన్స్వీప్..
సార్వత్రిక సమరంలో బీజేపీ విజేతగా నిలిచింది. మెజార్టీ స్థానాల్లో గెలుపొంది సీట్ల సునామీ సృష్టించింది. మోడీ వేవ్తో ప్రభంజనం సృష్టించిన కమలం పార్టీ ఆరు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతిపక్షాలకు చుక్కలు చూపించింది. ఆయా రాష్ట్రాల్లో అన్ని స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.
మోడీ స్వస్థలం గుజరాత్లో బీజేపీ ప్రభంజనం కొనసాగింది. అక్కడ మొత్తం 26 లోక్సభ సీట్లు ఉండగా.. అన్ని స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్లో 25కు 25, ఢిల్లీలో 7, ఉత్తరాఖండ్లో 5, హిమాచల్ ప్రదేశ్లో 4, త్రిపుర రాష్ట్రంలో ఒక్క స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాలైన చండీగఢ్, డామన్ డయ్యూ, దాదర్ నగర్ హవేలీల్లో ఉన్న ఒక్కో సీటును కాషాయపార్టీ కైవసం చేసుకుంది.
మధ్యప్రదేశ్లో మొత్తం 29సీట్లు ఉండగా.. బీజేపీ ఒక్కటి మినహా 28 స్థానాల్లో విజయం సాధించింది. జార్ఖండ్లో 14లో 12, హర్యానాలో 10కి 9 సీట్లను ఖాతాలో వేసుకుంది. మహారాష్ట్రలో 48 స్థానాల్లో శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ 40చోట్ల సత్తా చాటింది.
పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకున్నకాంగ్రెస్..! అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమీకి కారణం చంద్రబాబేనా...?