నేను కాపాలాదారుని కాదు : పాగల్ అనాలని సిద్ధరామయ్య సంచలనం
హైదరాబాద్ : కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు తనను 'చౌకీదార్' బదులు పాగల్ అనాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే భావన ఆ పార్టీ నేతలైనా ఈశ్వరప్ప నుంచి ప్రధాని మోదీ వరకు భయం పట్టుకుందని విమర్శించారు.

పిచ్చోడిని చేస్తున్నారు ?
ప్రజలు మంచొళ్లే, కానీ బీజేపీ నేతలే తనను చౌకీదార్ అని అభివర్ణిస్తూ పిచ్చొడిని చేస్తున్నారని తనదైనశైలిలో విమర్శించారు. సిద్ధరామయ్య సీఎంగా ఉన్న సమయంలో బీజేపీ నేత ఈశ్వరప్ప కలిసి ఆరేళ్ల బాలికపై లైంగికదాడి జరిగిందని చూపించారు. దానికి సిద్ధరామయ్య స్పందిస్తూ ... అందులో తప్పేముందని అనడంతో వివాదం మొదలైంది. ఓ మనవరాలి వయసున్న బాలికపై సిద్ధరామయ్య వైఖరి ఇది అని విమర్శల పరంపర కొనసాగింది.
ఇదీ తేడా ?
ఇది ప్రధాని మోదీ, సిద్ధరామయ్య వైఖరికి గల తేడా అని ఈశ్వరప్ప వివరించారు. ఈ ఘటన తర్వాతే 12 ఏళ్ల కన్నా చిన్నారులపై లైంగిక దాడి చేస్తే ఉరిశిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇది మోదీకి ఉన్న నిబద్ధత, ఈ అంశంపై మాట్లాడాలని కోరారు. మీరు మోదీ, యడ్యూరప్ప, తనను తిట్టినంత మాత్రానా చేసిన మంచి, చెడును ప్రజలు మరచిపోరని స్పష్టంచేశారు.
సంక్షేమం
దేశ ప్రయోజనాల కోసం మోదీ పడుతున్నారని గుర్తుచేశారు. రైతుల సంక్షేమం, హిందువులు, దళితుల ప్రయోజనం, సైనికుల మంచి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఈశ్వరప్ప వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించింది. ఈశ్వరప్ప కేవలం అమానవీయంగా ఆలోచిస్తున్నారని ఆ పార్టీ నేత దినేష్ గుండురావు ఆరోపించారు. సిద్ధరామయ్య మనవరాలిపై లైంగికదాడి జరిగి ఉంటే అని ఈశ్వరప్ప ఎలా అంటారని ప్రశ్నించారు. ఓ సీఎంకు ఇచ్చే విలువ ఇదేనా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications