పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: వెనక్కి తగ్గిన బీజేపీ
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలవాలి అని బీజేపీకి భయం పట్టుకునింది. ఇప్పటి నుంచే ఎన్నికల ప్రాచారం మొదలు పెడితే మొదటికే మోసం వస్తుందని బీజేపీ నాయకులు భయపడుతున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏలోని బీజేపీతో పాటు శాసన సభ ఎన్నికల్లో పోటి చేసిన మిత్రపక్షాల వారు ఓటమి చవిచూశారు. ఇప్పుడు వెంటనే పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారం మొదలు పెడితే అక్కడి ప్రతిపక్షాలు చేసే విమర్శలు ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నారు.

అంతే కాకుండ అక్కడి ప్రజలకు మనం ఏమని సమాధానం ఇవ్వాలి అని అంటున్నారు. ఈనెల 30వ తేదిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో బహిరంగ సమావేశంలో పాల్గోని ఎన్నికల ప్రచారం చెయ్యాలని భావించారు.
అయితే ఆ సమావేశాన్ని రద్దు చేసుకోవాలని గురువారం అమిత్ షా నిర్ణయించారు. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో అదే పరిస్థితి ఎదురైతే ఎలా అని ఆలోచిస్తున్నారు. 2016 జనవరి నుంచి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గోనడానికి రంగం సిద్దం చేశారు.












Click it and Unblock the Notifications