వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూడల సంఘమ ఆలయాన్ని సందర్శించిన అమిత్ షా, అక్కడకు వెళ్లలేదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శనివారం హునగుంద నుంచి సంఘసంస్కర్త బసవేశ్వరుడు లింగైక్యమైన అలమట్టి జలాశయ సమీప కూడల సంఘమపుణ్య క్షేత్రాన్ని దర్శించుకున్నారు. సంగమేశ్వరుడికి అర్చన చేశారు.

అయితే సమీపంలోని బసవన్న గుడికి వెళ్లలేదు. సమీపంలోని ప్రముఖ లింగాయత్ ఇనిస్టిట్యూషన్స్‌కు వెళ్లకపోవడానికి కారణం ఉందని అంటున్నారు. కొందరు లింగాయత్ గురువులు ప్రత్యేక మతం గురించి విజ్ఞాపన పత్రాలు ఇస్తారేమోనని వెళ్లకపోయి ఉంటారని అంటున్నారు.

BJP president visits Kudalasangama shrine, skips Basvanna Shrine

కాగా, కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వ పతనానికి లెక్కింపు ఆరంభమైందని అమిత్‌ షా అన్నారు. బాగలకోట జిల్లా హునగుంద పట్టణంలో శనివారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించటం ఖాయమని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 12 రాష్ట్రాల్లో జెండా ఎగరవేశామన్నారు. కర్ణాటకలోనూ బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతుందన్నారు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపైనే కాంగ్రెస్‌ పార్టీ చాలా ఎక్కువగా ఆధారపడిందని, అలాంటి సిద్ధరామయ్య అనివార్యంగా బాదామిలో కూడా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అక్కడా ఆయనకు పరాభవం తప్పదన్నారు.

English summary
It is said that Amit Shah may have skipped these places as he is apprehensive that the seers in favour of a separate Lingayat faith may submit memos to him with regard to the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X