వదినను బెడ్ రూమ్ లోకి లాగిన మరిది ఏం చేశాడంటే, అన్న ఇంట్లో లేడని ?
తన భర్త సోదరుడు తనపై అత్యాచారం చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేసి తనను శారీరకంగా హింసించి తన పరువు తీశాడని ఓ మహిళ కర్ణాటకలోని అంకోలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
అంకోలా పట్టణంలోని కాకర మఠం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 4వ తేదీన సాయంత్రం 4. 50 గంటల సమయంలో తాను షాపు నుంచి ఇంటికి వెళ్లానని, ఆ సమయంలో తన భర్త సోదరుడు ఉమర్ అహ్మద్ షేక్ అక్కడికి వచ్చాడని ఆమె ఫిర్యాదులో తెలిపింది.

మీ భర్త ఎక్కడికి వెళ్లాడు అని తన మరిది అహ్మద్ షేక్ తనను అడిగాడని, ఆ సమయంలో తాను బయటకు వెళ్లాడని చెప్పానని ఆమె అంటోంది. తరువాత నీ భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?, ఇంటికి ఎప్పుడు వస్తాడని తనను అహ్మద్ షేక్ బెదిరించాడని, నీ భర్త మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామని, అతడిని జైలుకు పంపిస్తానని తన మరిది తనను బెదిరించాడని బాదితురాలు అంటోంది. తరువాత తానను అనుసరించి లోపలికి వచ్చిన తన మరిది అహ్మద్ షేక్ తన చేయి పట్టుకుని లాగి కొట్టాడని బాధితురాలు ఆరోపించింది.
తనను ఇంట్లోకి లాగి తన మీద లైంగిక దాడి చేసి తనను శారీరకంగా ఇబ్బంది పెట్టాడని, తరువాత తన బట్టలు కూడా చింపి తన పరువు తీశాడని బాధితురాలు ఆరోపించింది. తాను గట్టిగా అరుస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించానని, ఆ సమయంలో తనతో పాటు తన భర్తను మళ్ళీ దూషించిన తన మరిది అహ్మద్ షేక్ తనను పడకగదిలోకి లాక్కొని వెళ్లాడని బాధితురాలు ఆరోపించింది.

బెడ్ రూమ్ లో తన మీద లైంగిక దాడి చేసిన తన మరిది ఉమర్ షేక్ ఈ విషయం బయటకు చెబితే నీ అంతు చూస్తానని బెదిరించాడని, నీ భర్తను సామాన్యంగా నేను వదలనని, నీ భర్తను నిన్ను ఇద్దరినీ చంపేస్తానని తన మరిది అహ్మద్ షేక్ బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడు ఉమర్ అహ్మద్ షేక్ మీద కేసు నమోదు చేశామని, కేసు నమోదు అయ్యిందని తెలుసుకున్న ఉమర్ షేక్ పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని అంకోలా పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications