Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cauvery water: ఇళ్లు దోచుకున్న తరువాత దొంగ దొంగ అని అరిచినట్లు ఉంది, బీజేపీ !

బెంగళూరు: తమిళనాడుకు కావేరి నీళ్లు వదిలేసిన తరువాత ఇప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టడం సరికాదని కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్. యడియూరప్ప అన్నారు. కర్ణాటక రాష్ట్రం తరఫున ఆగస్టు 26వ తేదీన సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించాలని అఖిల పక్ష పార్టీ నాయకులు కర్ణాటక ప్రభుత్వానికి సూచించారు.

బుధవారం విధానసౌడలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ ఏ కారణం చేతనైనా కావేరి నీటిని విడుదల చేయలేమని కర్ణాటక ప్రభుత్వం తేల్చిచెప్పాలన్నారు. ఈ అఖిలపక్ష సమయం అనంతరం మాజీ సీఎం డీవీ. సదానందగౌడ మాట్లాడుతూ కావేరి నీటిని విడుదల చేసి అఖిలపక్ష సమావేశం పెట్టడం సరికాదని సిద్దరామయ్య ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

BS Yeddyurappa questioned why an all-party meeting was organized after releasing Cauvery water to Tamil Nadu.

మేకదాటు ప్రాజెక్టుకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తొలగిపోయి ముందుకు సాగాలి. తమిళనాడులోని డ్యామ్‌ల నీటి సరఫరా, అక్కడి రైతుల వ్యవసాయ విధానాలు, మూడు పంటలు పండే తీరు గురించి వివరించారు. కర్ణాటకలోని మన రైతులు రెండు పంటలు మాత్రమే పండిస్తున్నారని సుప్రీంకోర్టుకు చెప్పాలని, తరువాత మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతులు పొందాలని మాజీ సీఎం సదానందగౌడ సిద్దరామయ్య ప్రభుత్వానికి సూచించారు.

మండ్య జిల్లాలో నీటిపారుదల సమావేశాని ఆ జిల్లా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎందుకు పిలవలేదని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ప్రశ్నించారు. ఏఐసీసీ సమావేశంలో కర్ణాటక రైతులకు మినుము, బత్తాయి పండించమని చెప్పి తమిళనాడు రైతులకు కావేరి నీళ్లు ఇచ్చారా అని బీజేపీ నాయకులు సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

BS Yeddyurappa questioned why an all-party meeting was organized after releasing Cauvery water to Tamil Nadu.
జూన్, జూలై, ఆగస్టు నెలల్లో తమిళనాడుకు ఇవ్వాల్సిన దానికంటే తక్కువ నీరు ఇచ్చామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెబుతున్నారు. అయితే కర్ణాటక రైతులకు ఇంత వరకు ఎంత కావేరి నీరు వదిలిందో చెప్పడం లేదని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. మేకేదాటు, మహాదాయి ప్రాజెక్టులకు సంబంధించి అఖిలపక్ష బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించారు.
BS Yeddyurappa questioned why an all-party meeting was organized after releasing Cauvery water to Tamil Nadu.

అనంతరం మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో రెండు అంశాలు ఉన్నాయన్నారు. మహాదాయి సమస్యకు సంబంధించి గోవా ప్రభుత్వం అటవీశాఖ అధికారి ద్వారా అభ్యంతర పత్రాన్ని అందజేసిందని తెలిపారు. కర్ణాటక రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు బీజేపీ కట్టుబడి ఉందని బసవరాజ్ బోమ్మయ్ చెప్పారు.

BS Yeddyurappa questioned why an all-party meeting was organized after releasing Cauvery water to Tamil Nadu.
కావున కర్ణాటక రైతుల పక్షాన సహకరిస్తామని, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు బీజేపీ నిబద్ధతను ప్రదర్శిస్తుందని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ స్పష్టం చేశారు. కావేరీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథనారాయణ ఆరోపించారు. తమిళనాడుకు నీటి విడుదల తర్వాత హడావుడిగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు.

ఇల్లు మొత్తం దోచుకున్న తరువాత దొంగ దొంగ అని అరిచినట్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉందని ఆ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు విమర్శించారు. బుధవారం బెంగళూరులోని విదానసౌధలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు బీఎస్‌ యడ్యూరప్ప, బసవరాజ్ బోమ్మయ్, డీవీ సదానంద్‌గౌడ్‌, జేడీఎస్ మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+