బడ్జెట్ ఎఫెక్ట్: మొబైల్స్, ల్యాప్టాప్ ధరలు పెరిగే ఛాన్స్
Recommended Video
న్యూఢిల్లీ: బడ్జెట్ దెబ్బతో మొబైల్స్ ధరలు పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీని పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో మొబైల్ ధరలను పెరిగే అవకాశం ఉంది.
దేశీయ మొబైల్ పరిశ్రమకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొనే మొబైల్ పరికరాల విడి విబాగాలపై కష్టమ్స్ డ్యూటీని పెంచాలని నిర్ణయం తీసుకొన్నారు.
దేశంలోనే అన్ని రకాల వస్తువులను తయారు చేసే విధంగా మేకిన్ ఇండియాను ప్రోత్సహించాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీనికి గాను కేంద్రప్రభుత్వం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొనే మొబైల్ పరికరాలపై భారీగా కష్టమ్స్ డ్యూటీని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.
కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుండి 20 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం కారణంగా మొబైల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.