వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : ఇంటి పైకప్పుకు భర్త శవం.. రాత్రంతా అలాగే గడిపిన భార్య..

|
Google Oneindia TeluguNews

కేరళలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. కేన్సర్ పేషెంట్ అయిన ఓ మహిళ రాత్రంతా ఇంట్లో తన భర్త శవంతో గడపాల్సి వచ్చింది.ఇంటి పైకప్పుకు వేలాడుతున్న తన భర్తను చూస్తూ.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో.. ఏడ్చి ఏడ్చి ఆమె వేదన అరణ్య రోదన గానే మిగిలిపోయింది.

పోలీసుల కథనం ప్రకారం... అలువాలో నివాసం ఉండే జోషి(67) అనే ఓ వ్యక్తి సోమవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామీణ పోలీస్ ప్రధానధికారి కార్యాలయం ఎదురుగానే ఆ ఇల్లు ఉంది. జోషి భార్య లిస్సీ క్యాన్సర్ పేషెంట్. మంగళవారం కోమోథెరపీ కోసం ఆసుపత్రికి వెళ్లిన ఆమె సాయంత్రం సమయంలో ఇంటికి తిరిగొచ్చింది. లోపలికి వెళ్లగానే.. పైకప్పుకు ఉరేసుకున్న వేలాడుతున్న భర్త కనిపించడంతో ఒక్కసారిగా షాక్ తిన్నది.

Cancer Patient Spends Night With Husbands Body After He Commits Suicide

గట్టిగా అరవడంతో ఇరుగుపొరుగు పరిగెత్తుకొచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్ఐ సంఘటనా స్థలానికి వచ్చారు. జోషి చనిపోయాడని నిర్దారించినప్పటికీ.. సాంకేతిక కారణాల వల్ల మృతదేహాన్ని కింద దింపడం కుదరదని చెప్పారు. నిబంధనల ప్రకారం ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల మధ్యలో డెడ్ బాడీలను కిందకు దించి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తామని చెప్పారు. రాత్రి పూట కావడంతో ఉదయం 6గంటల వరకు వేచి చూడాల్సిందేనని చెప్పారు. అయితే అలువా మున్సిపల్ కౌన్సిలర్ జెరోమ్ మైకెల్ రూరల్ పోలీస్ చీఫ్‌కు సమాచారం ఇవ్వడంతో.. తదనంతర కార్యక్రమాలు పూర్తి చేయాలని పోలీసులను ఆదేశించారు. అయినప్పటికీ పోలీసులు ఆదేశాలను పట్టించుకోలేదు. మరుసటి రోజు ఉదయం లిస్సీ ఇంటికి వచ్చి మృతదేహాన్ని కిందకు దించి 20 నిమిషాల్లో ఫార్మాలిటీస్ పూర్తి చేశారు.

కేవలం 20 నిమిషాల్లోనే పోలీసులు ప్రొసీజర్ పూర్తి చేశారని.. ఆ పనేదో సోమవారం సాయంత్రమే పూర్తి చేసి ఉండాల్సిందని అన్నారు. సాయంత్రం 5.10గంటలకే పోలీసులు లిస్సీ ఇంటికి వచ్చారని.. అయినప్పటికీ ఫార్మాలిటీస్ పూర్తి చేయలేదని అన్నారు. అవసరమైతే ఫోటోలు,వీడియోలు తీసుకుని మృతదేహాన్ని కిందకు దించి ఆసుపత్రికి తరలించాల్సిందని అన్నారు.పోలీసుల విచారణ ప్రకారం.. లిస్సీ,ఆమె భర్త జోషి మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒకరు పెళ్లి చేసుకుని వేరుగా ఉంటుండగా.. మరొకరు విదేశాల్లో ఉంటున్నారు. లిస్సీకి క్యాన్సర్ తెలిసినప్పుడు జోషి తీవ్రమైన షాక్‌కి గురయ్యాడు. అతను కూడా అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందో ఏమో సోమవారం సాయంత్రం అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

English summary
In a shocking incident which took place in Kerala, a woman suffering from cancer spent the entire night next to her husband's dead body who committed suicde by hanging himself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X