బోఫోర్స్ కేసుపై మరోసారి సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ
న్యూఢిల్లీ: బోఫోర్స్ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పన్నెండేళ్ల క్రితం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
రూ.64కోట్ల బోఫోర్స్ కుంభకోణంలో యూకేకు చెందిన వ్యాపారవేత్తలు హిందుజా సోదరులు, స్వీడన్ కంపెనీపై ఢిల్లీ కోర్టు కేసులు కొట్టేయడాన్ని సీబీఐ సవాలు చేస్తోంది.

కాంగ్రెస్ హయాంలో హెలికాఫ్టర్ల కొనుగోలుకు సంబంధించిన ఈ కుంభకోణం విషయంలో అటార్నీ జనరల్ వేణుగోపాల్ ఇటీవల ప్రభుత్వానికి సిఫార్సులు చేసిన నేపథ్యంలో సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. కాగా, బీజేపీ నేత, న్యాయవాది అయిన అజయ్ కుమార్ అగర్వాల్ బోఫోర్స్ కేసులో గత ఏడాది ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేశారు.












Click it and Unblock the Notifications