హీరో విశాల్ ఆరోపణలపై రంగంలోకి సీబీఐ-సెన్సార్ బోర్డులో ముగ్గురిపై కేసు నమోదు...
తమిళ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ చిత్రం హిందీ వెర్షన్ కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు రూ.7 లక్షలు లంచం అడిగారన్న ఆరోపణలపై సీబీఐ రంగంలోకి దిగింది. సెన్సార్ బోర్డులో ముగ్గురిపై కేసు నమోదు చేసింది. మార్క్ ఆంటోనీ చిత్రం సర్టిఫికేషన్ విషయంలో అసలేం జరిగిందన్న దానిపై సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో వీరిని అరెస్టు చేసే అవకాశముంది.
తాను నటించి, నిర్మించిన మార్క్ ఆంటోనీ చిత్రం హిందీ వెర్షన్ కు క్లియరెన్స్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు రూ.7 లక్షలు లంచం డిమాండ్ చేయడంతో ఆగ్రహించిన హీరో విశాల్.. వారు అడిగిన మొత్తం రెండు విడతలుగా చెల్లించారు. వాటికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలతో ఆ తర్వాత ఓ ట్వీట్ చేశారు. ఇందులో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. తనలాంటి వారి పరిస్దితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్ధితి ఏంటని ప్రశ్నించారు.

దీంతో కేంద్రం వెంటనే స్పందించింది. సెన్సార్ బోర్డు సభ్యులు హీరో విశాల్ చిత్రానికి క్లియరెన్స్ కోసం రూ.7 లక్షల లంచం డిమాండ్ చేయడమే కాకుండా తీసుకున్న విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. వెంటనే విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ప్రాథమిక వివరాలు సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో సెన్సార్ బోర్డుకు చెందిన ముగ్గురిపై కేసులు పెట్టింది. అయితే వీరి వివరాలను మాత్రం సీబీఐ బయటపెట్టడం లేదు.
అయితే సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వ్యక్తులు మెర్లిన్ మేనగా, జీజా రాందాస్, రాజన్ ఎమ్, మరికొందరు సెన్సార్ బోర్డు అధికారులు కూడా ఉన్నట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. వీరిపై సెప్టెంబర్లో ఒక ప్రైవేట్ వ్యక్తి రూ. 7 లక్షల లంచం పొందేందుకు, హిందీలో డబ్ చేసిన చిత్రానికి అవసరమైన సెన్సార్ సర్టిఫికేట్ కోసం ముంబైలోని సెన్సార్ బోర్డు నుండి అవసరమైన సెన్సార్ సర్టిఫికేట్ పొందడానికి ఇతరులతో కలిసి కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయని సీబీఐ ప్రతినిధి వెల్లడించారు.
-
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
రాజేంద్ర ప్రసాద్కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications