CBSE 12th Result: 12వ తరగతిలో మార్కులు ఎలా ఇస్తారో సుప్రీంకోర్టు చెప్పిన సీబీఎస్సీ - Newsreel
విద్యార్థుల 10, 11, 12వ తరగతుల్లో చూపిన ప్రతిభ ఆధారంగా 12వ తరగతి మార్కులు జారీ చేయనున్నట్లు సీబీఎస్ఈ సుప్రీంకోర్టుకు చెప్పింది.
ఫలితాల్లో 10వ తరగతిలో వచ్చిన మార్కుల్లో 30, 11వ తరగతికి 30, 12వ తరగతికి 40 శాతం వెయిటేజీ ఇస్తామని చెప్పింది.
12వ తరగతి ఫలితాలు జులై 31న విడుదల చేస్తామని సీబీఎస్ఈ 12 మంది సభ్యుల కమిటీ సుప్రీంకోర్టుకు చెప్పింది.
12వ తరగతి విద్యార్థులకు ఎలా మూల్యాంకనం చేస్తామో సీబీఎస్ఈ సుప్రీంకోర్ట్ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ మహేశ్వరి వెకేషన్ బెంచ్కి సమాచారం ఇచ్చింది.
10, 11వ తరగతి పరీక్షల్లో ఏ మూడు సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చాయో, వాటి ఆధారంగా ఈ మార్కులు ఉంటాయని చెప్పింది.
మరోవైపు 12వ తరగతి యూనిట్, టర్మ్, ప్రాక్టికల్ పరీక్షల మార్కులు కూడా వీటికి జోడిస్తామని చెప్పింది. ఈ రెండింటి ఆధారంగానే 12వ తరగతి విద్యార్థులు మార్కులు పొందుతారని చెప్పింది.
వివిధ స్కూళ్లలోని మూల్యాంకన వ్యవస్థలో ఉన్నతేడాల్లో సమానత్వం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏజీ కేకే వేణుగోపాలన్ సుప్రీంకోర్టుకు చెప్పారు.
ప్రతి స్కూల్లో ఒక రిజల్ట్ కమిటీ ఏర్పాటు చేయాల్సుంటుందని, అది 12వ తరగతి మూల్యాంకనంలో తమ సాయం అందిస్తుందని చెప్పారు.
ఏ విద్యార్థి అయినా ఈ మూల్యాంకన ప్రక్రియలో ఫెయిల్ అయితే వారిని 'ఎసెన్షియల్ రిపీట్' లేదా 'కంపార్ట్మెంట్ కేటగిరీ'లో ఉంచుతామని వేణుగోపాలన్ సుప్రీంకోర్టుకు చెప్పారు.
దానితోపాటూ విద్యార్థుల్లో ఎవరికైనా మార్కులపై అసంతృప్తి ఉంటే వారికి తర్వాత జరిగే సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డ్ పరీక్షల్లో రాయడానికి అవకాశం ఇస్తామని తెలిపారు.
సీబీఎస్ఈ బోర్డ్ ఫార్ములాను సుప్రీంకోర్టు స్వీకరించింది. మార్కులపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు వారు పరీక్ష రాయవచ్చని చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- భారీ కృత్రిమ దీవి నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)