అసాధ్యం: జమిలి ఎన్నికలపై తేల్చేసిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు జరపాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ తేల్చి చెప్పారు.
దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. దీనికి న్యాయపరమైన అంశాలు పూర్తి చేయడానికి సమయం పడుతుందని అన్నారు. వీటికి తోడు వీవీప్యాట్ యంత్రాలు 100శాతం అందుబాటులో ఉండాలని, సమీప భవిష్యత్లో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని రావత్ స్పష్టం చేశారు.

ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలంటే అందుకు సరిపడా పోలీస్, పోలింగ్ సిబ్బంది అవసరం ఉంటుందని చెప్పారు. లోక్సభ, రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పలు ప్రయోజనాలున్నాయంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా న్యాయ కమిషన్కు లేఖ రాసిన మరుసటి రోజే రావత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అయితే, దీనిపై న్యాయశాఖ కమిషన్ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. కాగా, కాంగ్రెస్ సహా చాలా పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా, 2019 ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం), వీవీప్యాట్ యంత్రాలను సిద్ధం చేస్తోంది.
-
West Bengal: మమతకు ఈసీ మరో షాక్-13 జిల్లాల్లో ఎస్పీలపై..! -
మమత vs సువేందు.. దీదీ కంచుకోట బద్దలు..!! -
విజయ్ చుట్టూ వల- నయానో, భయానో -
5 రాష్ట్రాల సమరానికి సై, సెమీ ఫైనల్స్ - ఎవరిది పై చేయి...!! -
బెంగాల్ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు - మారుతున్న లెక్కలు..!! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..!











Click it and Unblock the Notifications