New Aadhar App: కొత్త ఆధార్ యాప్ తెచ్చిన కేంద్రం- ఫేస్ ఐడీ సహా కీలక ఫీచర్లతో..!
ఆధార్ సేవల్ని వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం.. ఇందులో భాగంగా ఇవాళ మరో కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఉన్న యాప్ లో ఫీచర్లకు అదనంగా మరిన్ని జోడించింది. ఈ కొత్త ఆదార్ మొబైల్ యాప్ ను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆవిష్కరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో ఈ యాప్ లో ఫీచర్లను వివరించారు.
New Aadhaar App
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 8, 2025
Face ID authentication via mobile app
❌ No physical card
❌ No photocopies
🧵Features👇 pic.twitter.com/xc6cr6grL0
ఈ కొత్త ఆధార్ యాప్ ఓపెన్ చేయగానే హార్టీ వెల్ కమ్ అనే మెసేజ్ కనిపిస్తోంది. ఆ తర్వాత కింద క్యూఆర్ కోడ్ స్కానర్ ను ఇచ్చారు. మన ముఖానికి ఎదురుగా ఫోన్ పెట్టుకుని దీన్ని స్కాన్ చేస్తే ఫేస్ ఐడీ ద్వారా ధృవీకరణ పూర్తి చేస్తుంది. ఆ తర్వాత యాప్ లో సేవల్ని వాడుకోవచ్చు. ఇది మన ఫోన్లో ఉంటే ఇక ఆధార్ కార్డును మనతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే జిరాక్స్ కాపీల్ని కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ లో తెలిపారు.

ఇప్పుడు కేవలం ఒక ట్యాప్తో, వినియోగదారులు అవసరమైన డేటాను మాత్రమే పంచుకోగలరని అశ్వీనీ వైష్ణవ్ తెలిపారు.
అలాగే వారి వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణను వారికే ఉంటుందన్నారు. అయితే ఈ కొత్త యాప్ ఇంకా టెస్టింగ్ దశలో (బీటా) ఉందని కేంద్రమంత్రి వెల్లడించారు. ఇందులో ఆధార్ ధృవీకరణ UPI చెల్లింపు చేసినంత సులభంగా ఉంటుందని కేంద్రమంత్రి తెలిపారు. వినియోగదారులు ఇప్పుడు వారి గోప్యతను నిర్ధారిస్తూ వారి ఆధార్ వివరాలను డిజిటల్గా ధృవీకరించవచ్చు మరియు పంచుకోవచ్చని తెలిపారు.
1/ Now with just a tap, users can share only the necessary data, giving them complete control over their personal information - New Aadhaar App (in beta testing phase) pic.twitter.com/kmO3P80gkW
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 8, 2025
కొత్త ఆధార్ యాప్ తో, వినియోగదారులు ఇకపై వారి ఆధార్ ను స్కాన్ చేయాల్సిన లేదా ఫోటోకాపీ చేయాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే హోటల్ రిసెప్షన్లలో, దుకాణాలలో లేదా ప్రయాణ సమయంలో ఆధార్ ఫోటోకాపీని అందజేయవలసిన అవసరం లేదన్నారు. ఆధార్ యాప్ సురక్షితమైనది మరియు వినియోగదారు సమ్మతితో మాత్రమే షేర్ చేయబడుతుందన్నారు.
2/ Aadhaar verification becomes as simple as making UPI payment.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 8, 2025
Users can now digitally verify and share their Aadhaar details while ensuring their privacy.
📲 Simply scan a QR code or use a requesting application. pic.twitter.com/1gORSLeVMY
కొత్త ఆధార్ యాప్ తో కచ్చితమైన గోప్యత ఉంటుందని, ఆధార్ డేటా దుర్వినియోగం లేదా లీక్లు ఇకపై ఉండవని కేంద్రమంత్రి తెలిపారు. ఫోర్జరీ లేదా ఎడిటింగ్ (మీ ఆధార్ను ఫోటోషాప్ చేయడం వంటివి!) నుండి రక్షణ కల్పిస్తుందన్నారు. త్వరలో దీన్ని పూర్తి స్దాయిలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.
3/ With the new Aadhaar app, users no longer need to get their Aadhaar scanned or photocopied.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 8, 2025
❌ No more scanned & printed copies pic.twitter.com/kAaP3vp3cQ
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications