దావూద్తో లింక్: పోలీసుల పేర్లు చెప్పిన ఛోటా రాజన్
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఇప్పటికీ ముంబై పోలీసులకు లింకులు ఉన్నాయని, వారితో నాకు ప్రాణహాని ఉందని ఛోటా రాజన్ సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
అందుకే ఛోటా రాజన్ ను ముంబై తరలించకుండా ఢిల్లీలోనే పెట్టాలని సీబీఐ అధికారులు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దావూద్ ఇబ్రహీంతో ముంబై పోలీసు అధికారులు చాల మంది కుమ్మక్కు అయ్యారని ఛోటా రాజన్ సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
పాకిస్థాన్ లో తలదాచుకున్న దావూద్ ఇబ్రహీంతో ఇప్పటికీ ముంబై పోలీసులు నిత్యం టచ్ లో ఉన్నారని, వారికి డీ గ్యాంగ్ నుంచి మామూళ్లు అందుతున్నాయని ఛోటా రాజన్ సీబీఐ అధికారులకు చెప్పాడు. ఛోటా రాజన్ మీద ముంబైలో దాదాపు 75 కేసులు ఉన్నాయి.

అందులో హత్యలు, స్మగ్లింగ్, బలవంతపు వసూళ్లు, కిడ్నాప్ లు తదితర కేసులు ఉన్నాయి. అయితే బాలిలో ఛోటా రాజన్ భారత్ బయలుదేరిన వెంటనే ముంబైలో నమోదు అయిన కేసులు అన్ని సీబీఐకి అప్పగిస్తున్నామని ముంబై పోలీసు కమిషనర్ అహమ్మద్ జావేద్ మీడియాకు చెప్పారు.
ఛోటా రాజన్ సీబీఐ కస్టడికి
శనివారం ఛోటా రాజన్ ఢిల్లీలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఐదు రోజుల పాటు విచారణ చెయ్యడానికి సీబీఐకి అనుమతి ఇచ్చారు. ఛోటా రాజన్ ను ఐదు రోజుల పాటు సీబీఐ అధికారులు విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications