ఎంత సీఎం అయినా.. !!
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మెన్ సంజూ శాంసన్ ఎట్టకేలకు ఫామ్ను అందిపుచ్చుకున్నాడు. సెంచరీతో ట్రాక్ ఎక్కాడు. బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. అతను ఫామ్ లోకి రావడం అభిమానులను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో శనివారం జరిగిన మ్యాచ్లో అనూహ్యంగా పుంజుకున్న ఈ ఓపెనర్ అద్భుతమైన శతకంతో తన సత్తా చాటాడు. జట్టు భారీ స్కోరు సాధించడంలో, ఘన విజయాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
సెంచరీ కోసం సంజు శాంసన్ తీసుకున్న బంతులు 52 మాత్రమే. అతని ఇన్నింగ్స్లో ఏకంగా బుల్లెట్ల వంటి 14 బౌండరీలు, మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి. గత మూడు మ్యాచ్లలో వరుసగా 6, 7, 9 పరుగులకే పరిమితమైన అతను ఈ మ్యాచ్తో ఒక్కసారిగా గేర్ మార్చాడు. అద్భుతంగా పుంజుకున్నాడు. ఈ శతకం అతని ఐపీఎల్ కెరీర్లో నాలుగోది కాగా, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సాధించిన మొదటి శతకం ఇదే కావడం విశేషం.

ఈ సెంచరీ ఇన్సింగ్స్లో శాంసన్ మరో మైలురాయిని కూడా అందుకున్నాడు. తన టీ20 కెరీర్లో మొత్తం 400 సిక్సర్లను బాదాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు పథుమ్ నిశ్శంక అతని క్యాచ్ను జారవిడిచాడు. దీంతో అనేక రికార్డులను తిరగరాశాడు. 2021లో ఐపీఎల్ లో చివరిసారిగా సెంచరీ చేశాడు సంజు. ఆ తర్వాత మళ్లీ శతకం ముఖం చూడటం ఇదే. ఈ ఐపీఎల్ సీజన్లో నమోదైన మొదటి శతకమూ ఇదే.
ఈ మ్యాచ్ ను అసాంతం తిలకించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఆయన మ్యాచ్ చూడటానికి విరామం తీసుకున్నారు. కారులో ప్రయాణిస్తూ ట్యాబ్ లో చెన్నై మ్యాచ్ ను ఆసక్తికరంగా వీక్షించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను స్టాలిన్ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ చేస్తున్నప్పటి వీడియో అది.
Amid a high-voltage campaign, a quick #IPL break!
— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 11, 2026
சாம்சன் செஞ்சுரியைப் பார்த்தாலும், என்னோட favourite தோனியை miss பண்ற feeling avoid பண்ண முடியல!#Dhoni 🦁 #CSKvDC #IPL2026 #CSK #SanjuSamson #Yellove 💛 pic.twitter.com/bHci5GCqIV
మ్యాచ్ను వీక్షించేందుకు ప్రచారం నుంచి కొంత విరామం తీసుకున్నానని స్టాలిన్ వెల్లడించారు. సంజు శాంసన్ సెంచరీ నమోదు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తనకు ఇష్టమైన క్రికెటర్ ఎంఎస్ ధోనీని ఈ మ్యాచ్లో మిస్సయిన ఫీలింగ్ ఉండేదని, సంజు శాంసన్ సెంచరీ దాన్ని భర్తీ చేసిందని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ధోనీ జట్టులో లేని లోటు ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
-
జయలలిత వారసురాలు! అమ్మ స్టైల్లో ఎన్నికల ప్రచారం -
ప్రతి నెలా రూ. 3,000 సాయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు -
West Bengal: బీజేపీతో బంధం బట్టబయలు-ముస్లిం పార్టీతో ఎంఐఎం కటాఫ్..! -
విజయ్ ప్రచారంలో దారుణం: అభిమానుల్ని బూట్లతో తన్నిన బౌన్సర్లు -
AIMIM పొత్తు పార్టీపై రూ. 1,000 కోట్ల స్టింగ్ ఆపరేషన్: ఒవైసీ కటీఫ్ -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications