షాక్: ఒకటో తరగతి బాలుడి మీద అత్యాచారయత్నం కేసు, వింటేనే విచిత్రం !
చండీగడ్: ఒకటో తరగతి కుర్రాడు అత్యాచారయత్నం చేశాడని కేసు నమోదు చేసిన విచిత్రమైన సంఘటన హర్యానాలో జరిగింది. ఒకటో తరగతి బాలిక మీద అత్యాచారయత్నం చేశారని ఆమె తల్లి ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశామని డీఎస్పీ రమేష్ కుమార్ మీడియాకు చెప్పారు.
హర్యానాలోని సిర్సా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలిక ఒకటో తరగతి చదువుతున్నది. పాఠశాలకు వెళ్లిన బాలిక సోదరుడితో కలిసి ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చిందని ఆమె తల్లి అంటున్నది. తన కుమార్తెను అదే పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న బాలుడు లైంగిక వేధింపులకు గురి చేశాడని బాలిక తల్లి ఆరోపిస్తున్నది.

విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అబ్బాయిల ఫోటోలను ఆసుపత్రిలో ఉన్న బాలికకు చూపించామని, బాలిక తెలిపిన వివరాల ఆధారంగా విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు.
ఇదే సమయంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లల మీద అత్యాచారయత్నం కేసులు పెట్టడం ఏమిటని, అసలు వాళ్లుకు అలాంటి విషయాల గురించి ఏమి తెలుసని విద్యార్థుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని డీఎస్పీ రమేష్ కుమార్ తెలిపారు. ఒకటో తరగతి బాలుడి మీద అత్యాచారయత్నం కేసు నమోదు చేశారని వెలుగు చూడటంతో అందరూ ముక్కన వేలేసుకుంటున్నారు.
-
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే.. -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది












Click it and Unblock the Notifications