నోట్ల రద్దు నాటి పరిస్థితి..: సీఏఏ, ఎన్ఆర్సీపై సీఎం అభ్యర్థి హేమంత్ సోరెన్ తీవ్ర విమర్శలు
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే.. ముఖ్యమంత్రి అభ్యర్థి, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం విడుదలవుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది.

సీఏఏ, ఎన్ఆర్సీలపై హేమంత్ సోరెన్ తొలిసారి
ఈ నేపథ్యంలో కాంగ్రెస్-జేఎంఎం కూటమి.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి హేమంత్ సోరెన్ అని ప్రకటించాయి. ఈ క్రమంలో తొలిసారి హేమంత్ సోరెన్ కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తొలిసారి తన గళం వినిపించారు. సీఏఏ, ఎన్ఆర్సీలను తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అంతేగాక, నోట్ల రద్దు అంశంపైనా కేంద్రాన్ని విమర్శించారు.

అలాంటివారు వద్ద పత్రాలు ఉంటాయా?
దమ్కా, బెర్హేత్ రెండు నియోజకవర్గాల నుంచి సోరెన్ విజయం సాధించే దిశగా సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తాము భారతీయులమని నిరూపించుకోవడానికి క్యూలో నిల్చోవాలా? అని ప్రశ్నించారు. దేశంలో 18 కోట్ల మంది కార్మికులు, ఇళ్లు లేనివారు కూడా ఉన్నారని.. వారంతా చట్టబద్ధమైన పత్రాలు ఎలా చూపగలరని నిలదీశారు. రోజూ కూలీ చేసుకునే ప్రజలు ఆ పత్రాల కోసం ఎటు తిరుగుతారని బీజేపీని ప్రశ్నించారు.

మరోసారి నోట్ల రద్దు పరిస్థితి..
నోట్ల రద్దు తర్వాత ఎలాగైతే ప్రజలు క్యూలలో నిల్చున్నారో.. ఇప్పుడు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు కూడా అలాంటి పరిస్థితే వస్తుందని ఆయన హేమంత్ సోరెన్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాత్రం బీజేపీ మాట్లాడటం లేదని అన్నారు.

జార్ఖండ్ ప్రజలు మాత్రం..
ప్రజల దేశ ఆర్థిక పరిస్థితి గురించి బీజేపీ ఎందుకు చెప్పడం లేదని హేమంత్ సోరెన్ ప్రశ్నించారు. నిరసన చేస్తున్నవారిని తీవ్రంగా అణిచివేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి మంచి చేయాలనే ఉద్దేశమే ఉంటే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఎందుకు నిలిపివేస్తున్నారని ప్రశ్నించారు. ఎందుకు ఇంతమంది ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని నిలదీశారు. ఎన్ఆర్సీ, మందిర్-మసీద్ అంశాలతో బీజేపీ ప్రజల్లోకి వెళుతోందని, తమ రాష్ట్రాన్ని కూడా ప్రభావితం చేయాలని చూసిందన్నారు. జార్ఖండ్ ప్రజలు మాత్రం అభివృద్ధికే ఓటు వేశారని సోరెన్ వ్యాఖ్యానించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications