CM Seat: ఆ ఇద్దరు డిసైడ్ చేస్తారు, బీజేపీ చీఫ్, రాజ్ భవన్ వైపు అందరిచూపు, ఎప్పుడైనా గ్రీన్ సిగ్నల్, రెబల్స్!
ముంబాయి/గోవా: శివసేన పార్టీ రెబల్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే దెబ్బకు మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆయన పదవికి రాజీనామా చెయ్యడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. ఇప్పుడు బంతి గవర్నర్ చేతిలో ఉంది. గవర్నర్ ఏం చెబుతారా ? అని మరాఠీలు వేచి చూస్తున్నారు. ఈ విషయంపై మహారాష్ట్ర బీజేపీ నాయకులు ఎక్కువగా మాట్లాడటం లేదు. కార్యకర్తలు కొంచెం సైలెంట్ గా ఉండాలని, సంబరాలు చేసుకునే టైమ్ దగ్గరపడిందని అంటున్నారు.
మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే ఏం డిసైడ్ చేస్తారో వేచి చూడాలని, వారిద్దరే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అన్ని నిర్ణయాలు తీసుకుంటారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అంటున్నారు.
రాజ్ భవన్ వైపు అందరిచూపు
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆయన పదవికి రాజీనామా చెయ్యడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. ఇప్పుడు బంతి మహారాష్ట్ర గవర్నర్ చేతిలో ఉంది. గవర్నర్ ఏం చెబుతారా ? అని మరాఠీలు వేచి చూస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు, మహారాష్ట్ర ప్రజలు ఇప్పుడు రాజ్ భవన్ వైపు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఇద్దరు నాయకులు డిసైడ్ చేస్తారు
మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో ఆ రాష్ట్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ కార్యకర్తల ఆనందానికి అవదులు లేకుండాపోయాయి. ఇదే సమయంలో మహారాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ ఆ ఇద్దరు నాయకులు డిసైడ్ చేస్తారని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
ఏ నిర్ణయం అయినా దేవేంద్ర, షిండే తీసుకుంటారు
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే ఏం డిసైడ్ చేస్తారో వేచి చూడాలని, వారిద్దరే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో, మంత్రి పదవుల విషయంలో అన్ని నిర్ణయాలు తీసుకుంటారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ క్లారిటీ ఇచ్చారు.
Recommended Video
ఉక్కిరిబిక్కిరి అవుతున్న మాజీ సీఎం ఠాక్రే వర్గీయులు
శివసేన పార్టీ రెబల్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే దెబ్బకు మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆయన పదవికి రాజీనామా చెయ్యడంతో శివసేన పార్టీలోని ఉద్దవ్ ఠాక్రే వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఏం చెయ్యాలని అంటూ మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్గీయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.