మమతా వేస్ట్ , కమ్యునిస్టులు బెస్ట్ : అమిత్ షా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమాతా బెనర్జీ బీజేపి సభలను అడ్డుకుంటున్నారని బీజీపీ చీఫ్ అమిషా మండిపడ్డారు. బీజేపీ సభలకు అనుమతులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. కాగా ఇవన్ని ప్రజలు గమనిస్తున్నారని అందుకే ఆమే సమావేశాలకు ప్రజలు రావడం లేదని అన్నారు. ఈనేపథ్యంలోనే బెంగాల్లో మమత కంటే కమ్యునిస్టులే బెటర్ అని అన్నారు.

కాగా పశ్చిమ బెంగాల్లో నేడు జరిగిన నాలుగు ర్యాలీల్లో పాల్గోని మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాలో ఓటర్లు బీజేపీ వైపే ఉన్నారని అన్నారు.కాగా బెంగాల్ లో పౌరసత్వ నమోదు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించేందుకే పోటి చేస్తున్నమని చెప్పారు. కాగా కశ్మీర్ కు ప్రత్యేక ప్రధాని ,ఆర్టికల్ 370 రద్దుపై మమతా బెనర్జీ తన అభిప్రాయాన్ని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరో వైపు సాద్వీ ప్రగ్యా సింగ్ పై పోటిపై స్పందస్తూ ఆమేపై హిందూ తీవ్రవాదం పేరుతో ఆమేపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. అయినా ఆమేను కోర్టులు నిర్దోషిగా తేల్చాయన్నారు.












Click it and Unblock the Notifications