ఎలక్షన్స్: పార్టీ టిక్కెట్ రాలేదని విషం తాగిన నేత, మృతి

Congress leader drinks poison, dies after being denied ticket
భోపాల్: ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్ నిరాకరించిందనే కారణంతో కాంగ్రెసు పార్టీకి చెందిన నాయకుడు ఆత్మహత్య చేసుకున్నారు! ఈ సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో మధ్య ప్రదేశ్ కూడా ఉంది.

నవంబర్ 25వ తేదీన జరిగే ఎన్నికలకు తనకు పార్టీ టిక్కెట్ నిరాకరించిందనే కారణంతో నర్సింగ్ మాల్వియా అనే నాయకుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

నర్సింగ్ మాల్వియా అగర్ ప్రాంతానికి చెందిన నాయకుడు. అతను ఈ రోజు ఉదయం విషం తాగాడు. అతనిని చికిత్స కోసం వెంటనే ఉజ్జయిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.

వివరాల మేరకు.. నర్సింగ్ మాల్వియా జిల్లా పంచాయతీ మెంబర్. అతను రెండు దశాబ్దాలుగా కాంగ్రెసు పార్టీలో పని చేస్తున్నారు. గతంలో అతను ఎప్పుడు రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో పాల్గొనలేదు. అయితే ఈసారి తనకు టిక్కెట్ వస్తుందని ఆశించారు.

అగర్ నుండి పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్ ఇస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారట. అయితే టిక్కెట్ మరో వ్యక్తికి వచ్చింది. టిక్కెట్ రాకపోవడంతో అతను విషం తాగారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+