12వ తరగతి పాఠ్యపుస్తకాల నుంచి మొఘలుల చరిత్ర తొలగింపు.. NCERT వివరణ ఇదే..!
ఢిల్లీ: మొఘలుల చరిత్రను 12వ తరగతి పాఠ్య పుస్తకాల నుంచి తొలగించేందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)నిర్ణయం తీసుకుందంటూ వార్తలు రావడంతో వివాదం చెలరేగింది. దీంతో విద్యాశాఖ రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. మొఘులుల చరిత్రపై పాఠాలను తొలగించడం లేదని చెప్పుకొచ్చారు. గతేడాది కరోనావల్ల చాలా వరకు పాఠాలను విద్యార్థులకు బోధించేందుకు వీలుపడలేదని చెప్పిన ఆయన ఈ క్రమంలోనే కొన్ని పాఠ్యాంశాలను తగ్గించి పిల్లల మీద ఒత్తిడి లేకుండా చేయాలని భావించినట్లు చెప్పారు.
#WATCH | Dinesh Prasad Saklani, Director of NCERT says, "It's a lie. (Chapters on) Mughals have not been dropped. There was a rationalisation process last year because due to COVID, there was pressure on students everywhere...Expert committees examined the books from std 6-12.… pic.twitter.com/647wdsPSSR
— ANI (@ANI) April 4, 2023
మొఘలుల చరిత్రను తొలగిస్తామనే నిర్ణయం జరిగిపోయిందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు.ఈ పాఠం తొలగించడం వల్ల విద్యార్థుల్లో ఉన్న విషయ జ్ఞానం లేదా లోకజ్ఞానం ఏమి తగ్గిపోదని వారిపై మాత్రం ఉన్న ఒత్తిడి భారం మాత్రమే తగ్గుతుందని నిపుణులు సూచించినట్లు దినేష్ ప్రసాద్ సక్లానీ పేర్కొన్నారు.ఇక దీనిపై చర్చ అనవసరం అని చెప్పిన ఆయన ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే పాఠ్యపుస్తకాలను పరిశీలించాలని కోరారు.

తాము జాతీయ విద్యా విధానం 2020ని అనుసరించే పనిచేస్తున్నట్లు దినేష్ చెప్పారు. ప్రస్తుతం రూపాంతరం చెందే దశలో ఉన్నట్లు చెప్పిన ఆయన... జాతీయ విద్యా విధానం విద్యార్థులపై భారం తగ్గించేలా డిజైన్ చేసినట్లు గుర్తు చేశారు. దాన్నే ఇప్పుడు అమలు చేస్తున్నామని చెప్పారు. పాఠశాల విద్య కోసం నేషనల్ కరుక్యులమ్ ఫ్రేమ్ వర్క్ను రూపొందించామని చెప్పారు. జాతీయ విద్యా విధానం ప్రకారమే 2024 విద్యా సంవత్సరానికి పాఠ్య పుస్తకాలు ప్రింట్ అవుతాయని చెప్పారు. ప్రస్తుతానికి ఏ పాఠాన్ని తొలగించలేదని పునరుద్ఘాటించారు.

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే ఎన్సీఈఆర్టీ 12వ తరగతికి సూచించిన కొత్త హిస్టరీ పుస్తకాలను వినియోగించనుంది. కొత్త ఎడిషన్లో ఏవైతే మార్పులు చేర్పులు చేశారో ఆ పుస్తకాలనే వినియోగిస్తామని యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications