Coronavirus: విదేశీ తబ్లీగి జమాత్ సభ్యులపై క్రిమినల్ కేసులు, వాళ్లను దేశం దాటించండి, హైకోర్టు ఆర్డర్
చెన్నై/న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను ఫుట్ బాల్ ఆడుకుంటున్న కరోనా వైరస్ (COVID 19) భారత్ ను వదిలిపెట్టడం లేదు. భారత్ లో కరోనా వైరస్ కు హాట్ స్పాట్ కు కారణం అయిన ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరై దేశం మొత్తం తిరిగేసిన విదేశీ తబ్లీగిలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించిన విషయం తెలిసిందే. వీసా నియమాలు ఉల్లంఘించిన విదేశీ తబ్లీగిలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి వీసాలు రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెట్టారు. అయితే విదేశీ తబ్లీగిలకు హైకోర్టులో ఊరట లబించింది. వెంటనే విదేశీ తబ్లీగిల మీద నమోదు చేసిన క్రిమినల్ కేసులు రద్దు చేసి వారిని వెంటనే దేశం దాటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీలో విదేశీయుల మీటింగ్
గత మార్చి నెలలో దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీగి జమాత్ సమావేశాలు జరిగాయి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి తబ్లీగి జమాత్ సభ్యులు ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఇదే తబ్లీగి జమాత్ సమావేశాలకు విదేశాల్లో ఉన్న తబ్లీగిలు హాజరైనారు.

కేంద్రం చెప్పినా డోంట్ కేర్
నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన వారికి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూడటంతో వారిని వెంటనే వైద్య శాఖ అధికారుల ముందు హాజరై వైద్య చికిత్సలు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం మనవి చేసింది. ఢిల్లీ నుంచి విదేశీ తబ్లీగిలు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను లెక్క చెయ్యకుండా విదేశీ తబ్లీగిలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయి ధార్మిక సమావేశాలు నిర్వహించారు.

కేంద్రం లాస్ట్ వార్నింగ్
ఢిల్లీ జమాత్ సమావేశాల్లో హాజరై ఇతర రాష్ట్రాలకు గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయిన విదేశీయులు వెంటనే లొంగిపోవాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అయినా విదేశీయులు స్వచ్చందంగా ఎవ్వరూ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ముందుకురాలేదు. వీసా నియమాలు ఉల్లంఘించి దేశం మొత్తం సంచరించిన విదేశీ తబ్లీగి జమాత్ సభ్యుల వీసాలను రద్దు చేసిన ప్రభుత్వాలు వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

ఇండోనేషియా, బాంగ్లాదేశ్ తబ్లీగిలు
ఢిల్లీ నుంచి తప్పించుకుని తమిళనాడు చేరుకుని అక్కడ తలదాచుకున్న ఇండోనేషియాకు చెందిన 21 మంది, బాంగ్లాదేశ్ కు చెందిన 11 మందిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. 31 మంది విదేశీ తబ్లీగి జమాత్ సభ్యులపై స్థానిక పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టి వారిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు.

వారిని దేశం దాటించండి
విదేశీ తబ్లీగి జమాత్ సభ్యుల కేసు విచారణ చేసిన మద్రాసు హైకోర్టు వారి మీద నమోదు చేసిన క్రిమినల్ కేసులు రద్దు చెయ్యాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే విదేశీయులను భారత్ నుంచి వారి స్వదేశాలకు పంపించేయాలని, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications