Coronavirus: బాధితుల కోసం కేంద్రం హెల్ప్ లైన్ నంబర్.. సందేహాలుంటే కాల్ చేయాలని!
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ బారినపడి చైనాలో ఇప్పటికే 170 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది వైరస్తో చికిత్స పొందుతున్నారు. చైనాయే కాదు థాయ్లాండ్, జపాన్, సింగపూర్, బ్రిటన్, అమెరికాలో కూడా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మిగతా దేశాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వైరస్ లక్షణాలు కనిపించినా, వైరస్ సింప్టమ్స్ ఎలాంటివి ఉన్నట్టు అనిపించినా కంప్లైంట్ చేయాలని హెల్ప్లైన్ నంబర్ ఇస్తున్నాయి.
24 గంటలు
24 గంటలు 7 రోజులు పనిచేసేలా హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటుచేశామని భారత ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్కు సంబంధించి ఏ విషయం తెలుసుకోవాలనుకొన్న ఫోన్ చేయాలని సూచించారు. +91-11-23978046 నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ సోషల్ మీడియా ట్విట్టర్లో ట్వీట్ చేసింది.
కాల్ చేయండి
+91-11-23978046 నంబర్కు ఫోన్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. వ్యాధి లక్షణాలు అనిపిస్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేరాలని సూచించారు. వైద్యారోగ్య చేసిన ట్వీట్కు నెటిజన్లు స్పందించారు. సిచుయేషన్ దారుణంగా ఉందని.. ఇప్పటికైనా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సూచించారు. మరికొందరు ట్వీట్ హిందీ, ఇంగ్లీష్లో కాకుండా స్థానిక భాషల్లో కూడా పెడితే బాగుంటుందని సూచించారు.
170 మంది మృతి..
చైనాలోని
వుహన్లో
కరోనా
వైరస్
వ్యాప్తి
చెందింది.
వైరస్
సోకి
ఇప్పటికే
170
మంది
చనిపోయారు.
మరో
7700
మంది
వైరస్
సోకి
చికిత్స
పొందుతున్నారు.
మంగళవారం
132
మంది
చనిపోగా..
బుధవారం
ఒక్కరోజు
40
మంది
వరకు
మృతిచెందడం
వైరస్
తీవ్రతకు
అద్దంపడుతోంది.
వైరస్
సోకిన
1370
మంది
పరిస్థితి
ఆందోళనకరంగా
ఉందని
వైద్యులు
తెలిపారు.
దీంతో
మృతుల
సంఖ్య
భారీగా
పెరిగే
అవకాశం
ఉంది.