వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ICU Bed: భర్తకు కరోనా, భార్యకు లిప్ లాక్, నడుం మీద ?, మా కోరిక తీర్చు, డాక్టర్లేనా ?, ప్రధాని, సీఎంకు!

|
Google Oneindia TeluguNews

పాట్నా/ నోయిడా/న్యూఢిల్లీ: హోలీ పండుగ జరుపుకోవడానికి కుటుంబ సభ్యులతో వెళ్లిన మహిళకు అనేక కష్టాలు ఎదరైనాయి. భర్తకు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. మూడుసార్లు టెస్టులు చేసినా కోవిడ్ పాజిటివ్ అనే వెలుగు చూసింది. ఇంతకాలం ఐసీయూలో చికిత్స పొందుతున్న భర్త కోలుకుంటాడని భార్య ఆశగా ఎదురు చూసింది. భార్య మీద కన్ను వేసిన డాక్టర్లు, ఆసుపత్రి వార్డు బాయ్ ఆమెతో చెలగాటం ఆడుకున్నారు. ఐసీయూ బెడ్ మీద నిస్సహాయ స్థితిలో పడి ఉన్న భర్త ముందే అతని భార్య పంజాబి డ్రెస్ వేల్ లాగేసి ఆమె నడుం మీద చేతులు వేసి లాక్కొన్ని పెదవులు కోరికేశారు. మరో ఆసుపత్రిలో భర్త ముందే ఆమెను పట్టుకుని లైంగిక వేధింపులకు గురి చేశారు. నోరు విప్పితే తన భర్తకు చికిత్స చెయ్యరని ఆమె మౌనంగా ఉండిపోయింది. అయితే భర్త ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో భాధితురాలు ఐసీయూ చికిత్స, ఆక్సిజన్ స్యామ్ గురించి బయటపెట్టి ఇప్పుడు తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించి తనకు న్యాయం చెయ్యాలని ప్రధాని మోదీ, సీఎం, మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేశారు.

Second wife: ఆంటీకి లవర్స్, వాళ్ల ఫ్రెండ్స్ కూతురితో రొమాన్స్, భర్తకు తెలిసి, నడిరోడ్లో వేసేశాడు!Second wife: ఆంటీకి లవర్స్, వాళ్ల ఫ్రెండ్స్ కూతురితో రొమాన్స్, భర్తకు తెలిసి, నడిరోడ్లో వేసేశాడు!

నోయిడాలో ఫ్యామిలీ...... హోలీ వేడుకల కోసం !

నోయిడాలో ఫ్యామిలీ...... హోలీ వేడుకల కోసం !

నోయిడాలో రోషన్ చంద్ర అనే వ్యక్తి కుటుంబం నివాసం ఉంటోంది. రోషన్ చంద్ర సోంత ఊరు బీహార్ లోని భాగల్ పూర్ జిల్లాలో ఉంది. హోలీ వేడుకలు జరుపుకోవడానికి రోషన్ చంద్ర అతని కుటుంబ సభ్యులతో కలిసి గత నెలలో భాగల్ పూర్ లోని సొంత ఊరికి వెళ్లాడు. రోషన్ చంద్ర భార్య రీనా రాయ్ ( ఆమె పేరు మార్చడం జరిగింది) కూడా వెళ్లింది.

ఆరోజు భార్యకు షాక్

ఆరోజు భార్యకు షాక్

హోలీ వేడుకలు పూర్తి అయిన తరువాత రోషన్ చంద్ర, రీనారాయ్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి నోయిడా బయలుదేరాలని డిసైడ్ అయ్యారు. అదే సమయంలో ఏప్రిల్ 9వ తేదీన రోషన్ చంద్ర అనారోగ్యానికి గురికావడంతో ఆయనకుRT-PCR పరీక్షలు చేయించారు, రోషన్ చంద్రకు కోవిడ్ పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆయన్ను భాగల్ పూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

మూడుసార్లు సేమ్ రిపోర్టు రిపీట్

మూడుసార్లు సేమ్ రిపోర్టు రిపీట్

భాగల్ పూర్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో మూడుసార్లు రోషన్ చంద్రకు RT-PCR పరీక్షలు చేసినా కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. భార్య రీనారామ్ నోయిడాలో ఫ్యామిలీ డాక్టర్ కు వీడియో కాల్ చేసింది. వెంటనే మీరు CT స్కానింగ్ తీయించాలని నోయిడా డాక్టర్ చెప్పాడు. సీటీ స్కానింగ్ తీస్తే రోషన్ చంద్రకు ఊపిరితిత్తుల్లో 60 శాతం ఇన్ఫెక్షన్ ఉందని వెలుగు చూసింది. ఆ ఆసుపత్రిలో వైద్యం సక్రమంగా చెయ్యకపోవడంతో ఇక లాభం లేదని అతని భార్య రీనారాయ్ భాగల్ పూర్ లోని మాయగంజ్ ఆసుపత్రికి రోషన్ చంద్రను షిఫ్ట్ చేశారు.

ఐసీయూలో భర్త...... ఆవేదనలో భార్య....కామాంధుల కళ్లు

ఐసీయూలో భర్త...... ఆవేదనలో భార్య....కామాంధుల కళ్లు

మాయాగంజ్ ఆసుపత్రిలోని ఐసీయూలో రోషన్ చంద్రను చేర్పించారు. రోషన్ చంద్ర మాట్లాడలేని పరిస్థితి ఎదురైయ్యింది. ఏది కావాలన్నా సైగలు చెయ్యడం, లేదా పక్కన ఉన్న మొబైల్ ఫోన్ తో భార్య రీనారాయ్ కు మిస్ డ్ కాల్ ఇవ్వడం చేస్తున్నాడు. భర్త రోషన్ చంద్ర పరిస్థితి చూసి రీనారాయ్ తల్లడిల్లిపోయింది. అయితే మాయాగంజ్ ఆసుపత్రి వైద్యులు సక్రమంగా చికిత్స చెయ్యకపోవడమే కాకుండా రోషన్ చంద్ర భార్య రీనారాయ్ మీద కన్ను వేసి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

భర్త కళ్ల ముందే వేల్ లాగేసి, పెదాలు కోరికేసి, నడుం మీద ?

భర్త కళ్ల ముందే వేల్ లాగేసి, పెదాలు కోరికేసి, నడుం మీద ?

ఒక రోజు రోషన్ చంద్ర భార్య రీనారాయ్ కి మిస్ డ్ కాల్ ఇచ్చాడు. రీనారాయ్ వెళ్లి చూడగా ఐసీయూలో ఉన్న భర్త ముఖానికి ఏర్పాటు చేసిన ఆక్సిజన్ మాస్క్ పక్కకు పడిపోయిన విషయం గుర్తించిన రీనారాయ్ వెంటనే గట్టిగా కేకలు వేసింది. ఆసుపత్రి సీనియర్ డాక్టర్ కు రీనారాయ్ ఫిర్యాదు చేసింది. డాక్టర్లు ఆసుపత్రి నర్సు, వార్డుబాయ్ జ్యోతికుమార్ కు వార్నింగ్ ఇచ్చారు. డాక్టర్లు వెళ్లిపోయిన తరువాత ఐసీయూలో ఉన్న రీనారాయ్ మీద వార్డుబాయ్ జ్యోతికుమార్ మండిపడ్డారు. నా మీద డాక్టర్లకు ఫిర్యాదు చేస్తావా అంటూ ఐసీయూ బెడ్ మీద భర్త రోషన్ చంద్ర కళ్ల ముందే రీనారాయ్ పంజాబి డ్రెస్ వేల్ లాగేసి దగ్గరకు లాక్కోని ఆమె సున్నితమైన భాగాల్లో చేతులు వేసి నలిపేశాడు. అంతే కాకుండా తన పెదాలను లిప్ లాక్ చేసి కోరికేశాడని, నా నడుమీద, సున్నితమైన భాగాల్లో ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి నలిపేశాడని బాధితురాలు రీనారాయ్ ఆరోపించింది. తాను భయపడి ఐసీయూ రూమ్ బయటకు పరుగు తీసి కారిడార్లో కుర్చుంటే అక్కడికి వచ్చిన జ్యోతికుమార్ నీ అంతు చూస్తా, నిన్ను రేప్ చేస్తా చూడూ అంటూ అసభ్యంగా బూతులు తిట్టి దూషించాడని రీనారాయ్ ఆరోపించింది.

డాక్టర్లు కూడా వదల్లేదు..... సేమ్ టార్చర్

డాక్టర్లు కూడా వదల్లేదు..... సేమ్ టార్చర్

తన దగ్గర Remdesvir ఇంజెక్షన్ కొనుగోలు చేయించారని, ఆ ఇంజక్షన్ అర్దమాత్రం తన భర్త రోషన్ చంద్రకు వేశారని, మిగిలిన ఇంజక్షన్ వెయ్యకుండా తన భర్తకు టార్చర్ పెట్టారని రీనారాయ్ ఆరోపిస్తున్నదని. అంతే కాకుండా వైద్యులు కూడా తనను కామంతో చూసి ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ నన్ను లైంగిక వేధింపులకు గురి చేశారని, తాను ఎదదురుతిరిగితే నీ భర్తను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లిపో అంటూ మాయాగంజ్ఆసుపత్రి వైద్యులు బెదిరించారని రీనారాయ్ ఆరోపించింది. అక్కడి వైద్యుల లైంగిక వేధింపులు తట్టుకోలేక ఏప్రిల్ 26వ తేదీన పాట్నాలోని రాజేశ్వర్ ఆసుపత్రికి తన భర్తను తరలించి అక్కడ ఐసీయూలో చేర్పించామని రీనారాయ్ చెప్పింది.

ఆ డాక్టర్లు కామాంధులు

ఆ డాక్టర్లు కామాంధులు

పాట్నాలోని రాజేశ్వర్ ఆసుపత్రి ఐసీయూలో తన భర్త రోషన్ చంద్రకు సక్రమంగా ఆక్సిజన్ పెట్టలేదని, ఆక్సిజన్ బ్లాక్ లో కొనుగోలు చెయ్యలని తమ దగ్గర భారీ మొత్తంలో ఆసుపత్రి బిల్లు కట్టించుకున్నారని రీనారాయ్ ఆరోపించారు. ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్న అఖిలేష్ కుమార్ ఐసీయూ రూమ్ లో తన భర్త రోషన్ చంద్ర నిద్రపోతున్న సమయంలో చాలాసార్లు తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని, ఎంత ప్రాదేయపడినా అతను తనను వదల్లేదని రీనారాయ్ ఆరోపించారు.

Recommended Video

Twitter Donated 15M $ To India | Covid 19 | Jack Dorsey || Oneindia Telugu
ప్రధాని, సీఎంకు ఫిర్యాదు

ప్రధాని, సీఎంకు ఫిర్యాదు

తన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తే తన భర్తకు వైద్యం నిలిపేస్తారనే భయంతో చాలా రోజులు తాను మౌనంగా ఉన్నానని, చివరికి మే 8వ తేదీన తన భర్త రోషన్ చంద్ర ప్రాణం పోయిందని రీనారాయ్ భోరున విలపించింది. నా భర్త రోషన్ చంద్ర ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో భాధితురాలు భాగల్ పూర్, పాట్నాలోని రాజేశ్వర్ ఆసుపత్రిలో ఐసీయూ చికిత్స, ఆక్సిజన్ స్యామ్ గురించి బయటపెట్టి ఇప్పుడు తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించి తనకు న్యాయం చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, బీహార్ ఆరోగ్య శాఖా మంత్రి మంగల్ పాండే, బీహార్, ఢిల్లీలోని జాతీయ మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేశారు. రోషన్ చంద్ర భార్య వ్యవహారం బయటకు రావడం ఇప్పుడు బీహార్ తో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

English summary
COVID patient wife: The wife of a Covid patient, who succumbed in a private hospital in Patna on May 8, has alleged that a doctor there had molested her, while the hospital administration deliberately switched off the oxygen supply in the ICU, to force people to buy oxygen cylinders, and this caused her husband's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X