ఒక్కడే ''9,940'' కండోమ్స్ ఆర్డర్..ఎక్కడో తెలుసా..?
2023 సంవత్సరం ముగియడంతో..ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థలు గతేడాది తమ అత్యంత విలువైన ఆర్టర్లతో పాటు, ఎక్కువుగా ఏ వస్తువు కొనుగొలు చేశారనే అంశాలను తమ నివేదికలో పొందుపరిచారు. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ స్విగ్గీ 'ఇన్స్టామార్ట్ - 2023' పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో విస్తుపోయే విషయాలను వెల్లడించింది.

సెప్టెంబర్ నెలలో అత్యధికంగా కండోమ్స్ ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ సంస్థ తెలిపింది. కండోమ్స్ తరువాత ఉల్లిపాయి,అరటి పండు , చిప్స్ ఆర్డర్ చేసినట్టు స్విగ్గీ సంస్థ తమ నేవేదికలో పేర్కొంది. చైన్నైకి చెందిన ఓ వ్యక్తి 31,748 రూపాయిలు విలువ చేసే వస్తువులను ఆర్డర్ చేయడమే అతి పెద్ద ఆర్డర్గా నమోదైందని స్విగ్గీ తెలిపింది. ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి ఈ ఏడాదిలో ఇన్స్టామార్ట్లో రూ 12,87,920 ఆర్డర్లు చేసి మొదటి స్థానంలో నిలిచాడని స్విగ్గీ సంస్థ తమ నివేదికలో చెప్పుకొచ్చింది.

మరో ప్రముఖ ఆన్లైన్ స్టోర్ 'బ్లింకిట్' తమ షాపింగ్ వివరాలను విడుదల చేసింది. '2023 బ్లింకిట్ ట్రెండ్స్' పేరిట ఆన్లైన్ షాపింగ్ వివరాలను ప్రకటించింది. సౌత్ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 9,940 కండోమ్స్ ఆర్డర్ చేసినట్టు ఈ సంస్థ వెల్లడించింది. అతను తరువాత గురుగ్రామ్కు చెందిన వాసులు 65,973 లేటర్లు ఆర్డర్ చేసినట్టు తెలిపింది. ఈ ఏడాదిలో 30 లక్షల హ్యాంగోవర్ రాకుండా ఉండేందుకు వాడే ట్యాబ్లెట్లను కూడా ఆర్డర్ చేసినట్టు ఈ సంస్థ పేర్కొంది.












Click it and Unblock the Notifications