వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్న కూతురిపై మిత్రుడితో కలిసి గ్యాంగ్ రేప్

|
Google Oneindia TeluguNews

girl
ముంబై: నగరంలో దారుణం చోటు చేసుకుంది. తన కన్న కూతురిపై తన స్నేహితునితో కలిసి సామూహిక అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు ఓ దుర్మార్గపు తండ్రి. ఈ ఘటన గత నెల 31వ తేదీన నగరంలోని కశిమిరా అటవీ ప్రాంతంలో జరిగింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి నవంబర్ 15వరకు రిమాండ్ విధించడం జరిగింది.

తమ విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారని కశిమిరా పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఫతేహ్‌సింహ్ పాటిల్ తెలిపారు. నిందితులు పోలీసులకు చెప్పిన కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ జిల్లాలోని కోమల్ పూర్ గ్రామానికి చెందిన యువతి, 19ఏళ్ల తన ప్రియుడుతో కలిసి నాలుగు నెలల క్రితం అక్కడ్నుంచి పారిపోయి ముంబై చేరుకుంది.

నగరానికి చేరుకున్న వారు ఓ ఆలయంలో వివాహం చేసుకుని భయందర్‌లో నివాసం ఉంటున్నారు. కాగా యువతి తండ్రి నగరంలోని కశిమిరా సమీపంలోని దుచ్కల్పాడలో నివాసముంటున్న స్నేహితుని సహకారంతో తన కూతురు చిరునామాను తెలుసుకున్నారు. యువతి తండ్రి, అతని స్నేహితుడు కలిసి తన కూతురు నివాసానికి చేరుకుని తన కూతురును బలవంతంగా లాక్కెళ్లారు. ఆ సమయంలో తన కూతురు ప్రియుడు అక్కడ్నుంచి పారిపోయాడని నిందితులు తెలిపారు.

తన స్నేహితుని ఇంటికి తీసుకెళ్లిన తండ్రి ఆ యువతిని ఇంటికి రావాలని కోరాడు. ఇందుకు ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి కశిమిర సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆ యువతిపై తన స్నేహితునితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం యువతిని హత్య చేసి పొదల్లో పడేశారు. ఆ తర్వాత మద్యం సేవించిన యువతి తండ్రి ఓ హోటల్‌లో పనిచేసే కార్మికుడికి ఈ విషయాన్ని చెప్పాడు. ఆ కార్మికుడు హోటల్ యజమానికి చెప్పడంతో అతను స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితులపై ఐపిసి 302 (హత్య), 376(సామూహిక అత్యాచారం), 201, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా తన ప్రియుడితో పారిపోయి తమ కుటుంబ పరువును మంటకలిపిన తన కూతురుకు గుణపాఠం చెప్పేందుకే ఇలా చేశానని నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న యువతి ప్రియుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

English summary
A 17-year-old girl who had eloped to Mumbai with her boyfriend from Uttar Pradesh was allegedly gang-raped and murdered by her father and his friend on October 31 in the jungles of Kashimira. She was reportedly four months pregnant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X