సీఎం సిద్దరామయ్య తల నరికేయాలి, ఫేస్ బుక్ లో యువకుల వార్నింగ్, బెంగళూరులో!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీఎస్ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి తల నరికేయాలని ఫేస్ బుక్ లో బెదిరింపులకు దిగారు.

కాంగ్రెస్ గూండాగిరి
బెంగళూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ నలపాడ్ విద్వత్ అనే యువకుడి మీద దాడి చేశాడని. మాల్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్వత్ మీద మళ్లీ దాడి చేసి హత్యాయత్నం చేశారని కేసు నమోదు కావడంతో మోహమ్మద్ జైలుకు వెళ్లాడు.

24 మంది హత్య !
సీఎం సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయిన తరువాత కర్ణాటకలో 24 మంది హిందూ సంఘ, సంస్థల కార్యకర్తలు హత్యకు గురైనారని బీజేపీ ఆరోపిస్తుంది. ఫిబ్రవరి 16వ తేదీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బెంగళూరులో ఏకంగా బీబీఎంపీ కార్యాలయంలో పెట్రోల్ చల్లి నిప్పంటించడానికి ప్రయత్నించాడని కేసు నమోదు అయ్యింది.

గూండారాజ్యం అంతం
కర్ణాటకలో గూండారాజ్యం అంతం చెయ్యాలంటే ముఖ్యమంత్రి సిద్దరామయ్య తల నరికేయాలని బెదిరిస్తూ అరు పూజార్, ముకుంద నాయక్ అనే యువకులు ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. సీఎం సిద్దరామయ్య మీద చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఎవరీ యువకులు ?
అరు పూజార్ అనే యువకుడు మంగళూరు యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేసి ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఇక ముకుంద నాయక్ అనే యువకుడు ఎవరు ? ఎక్కడున్నాడు ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

సీఎంకే వార్నింగా ?
ఒక రాష్ట్రానికి ముఖ్యంత్రి అయిన సిద్దరామయ్య గౌరవమైన స్థానంలో ఉన్నారని, అలాంటి ఆయన తల నరికేయాలి అంటూ ఫోస్ బుక్ లో హెచ్చరికలు జారీ చేసిన ఇద్దరు యువకులను చట్టపరంగా అరెస్టు చెయ్యడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications