అన్నాడీఎంకే పార్టీ గుర్తు కోసం పోటీ: చివరికి వెనక్కి తగ్గిన జయలలిత మేనకోడలు దీపా !
అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కోసం ఇంతకాలం పోటీ పడుతున్న జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ చివరికి వెనక్కి తగ్గారు. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం తనకు కేటాయించాలని పెట్టుకున్న అర్జీని దీపా శుక
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కోసం ఇంతకాలం పోటీ పడుతున్న జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ చివరికి వెనక్కి తగ్గారు. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం తనకు కేటాయించాలని పెట్టుకున్న అర్జీని దీపా శుక్రవారం సాయంత్రం వెనక్కి తీసుకున్నారు.
మేనత్త జయలలితకు చెందిన అన్నాడీఎంకే పార్టీ తనదే అని, అమ్మ నిజమైన వారసురాలు నేను అంటూ కొన్ని నెలల క్రితం ఎన్నికల కమిషన్ కు దీపా అఫిడవిట్లు సమర్పించారు. రెండాకుల చిహ్నం తనకే కేటాయించాలని ఇంత కాలం ఎన్నికల కమిషన్ ముందు వాదనలు వినిపించారు.
శుక్రవారం భారత ఎన్నికల కమిషన్ ముందు వాదనలు జరిగిన సమయంలో దీపా తన అర్జీని వెనక్కి తీసుకున్నారు. రెండాకుల చిహ్నం కోసం పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గీయులు, శశికళ వర్గీయులు వాదనలు వినిపిస్తున్నారు. రెండాకుల చిహ్నం ఎవరికి కేటాయిస్తారో అనే ఉత్కఠకు ఇంకా తెరపడకపోవడంతో అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.